E-Paper
Advertisement

ISIS conspiracy case: ఐసిస్ కుట్రకేసు.. 13 మంది అరెస్ట్

ISIS conspiracy case: ఐసిస్ కుట్రకేసు.. 13 మంది అరెస్ట్

ISIS conspiracy case: ఐసిస్ కుట్రకేసుకు సంబంధించి శనివారం తెల్లవారుజాము నుండి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఏకకాలంలో 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, కర్ణాటక సహా నిర్వహించిన ఈ దాడుల్లో 13 మందిని అరెస్ట్ చేసింది. ఐసిస్ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్రలోని పుణె, ఠాణె, మీరా భయాందర్ తో సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు కర్ణాటకలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. పుణెలో 2 ప్రాంతాల్లో, ఠాణెలో 40 ప్రాంతాల్లో, కర్ణాటకలో మరో రెండు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

పుణె ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడైన షానవాజ్ ను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని నుంచి ఐఈడీలను తయారు చేసేందుకు ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. గత నెలలో ఏడుగురిని అరెస్ట్ చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు ఉగ్రముఠాలను ఏర్పాటు చేసి.. నిధులను సేకరిస్తున్నారని పేర్కొంది. వారి నుంచి మారణాయుధాలు, ఐఈడీ, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×