E-Paper
Advertisement

All Party Meet: ప్రత్యేక హోదాకు జేడీయూ డిమాండ్.. టీడీపీ సైలెంట్!

All Party Meet: ప్రత్యేక హోదాకు జేడీయూ డిమాండ్.. టీడీపీ సైలెంట్!

Special Status: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ప్రతిపక్షాలు బలంగా తమ వాణిని వినిపించాయి. ప్రతిపక్షానికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంపై చర్చ చేసింది. నీట్-యూజీ వివాదం, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐల దుర్వినియోగం వంటి అంశాలను లేవనెత్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ యూపీ ప్రభుత్వ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్వార్ యాత్ర పొడవునా ఉన్న షాపులు యజమానుల పేర్లను బహిరంగంగా రాసి పెట్టాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఇది ఒక వర్గాన్ని మరో వర్గానికి శత్రువుగా చేసే కార్యక్రమమేనని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీ నేత కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమావేశం ముగియకముందే జైరాం రమేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘ఈ రోజు జరిగిన అఖిపక్ష సమావేశంలో జేడీయూ నేత తమ రాష్ట్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విచిత్రంగా టీడీపీ నాయకులు మాత్రం ఈ విషయమై మౌనంగా ఉన్నారు’ అని వివరించారు. ఈ సమావేశం జరుగుతుండగానే జైరాం రమేశ్ ఈ ట్వీట్ వేశారు.

ఎన్డీయేలో జేడీయూ, టీడీపీలు కీలకంగా ఉన్నాయి. అత్యధిక ఎంపీలతో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండు పార్టీల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలో ఉండటం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే జేడీయూ తమ ప్రత్యేక హోదా డిమాండ్‌ను బలంగా చేస్తున్నది. అదే టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా అడగలేదు. టీడీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదాను అడుగుతుందని, ఇది పాత డిమాండే కాబట్టి, ఎన్డీయే ప్రభుత్వం కూడా నెరవేరుస్తుందని ఆశించారు. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయనే అర్థంలో మాట్లాడుతూ.. నేడు ఏపీలో టీడీపీ ఎక్కువ సీట్లు సాధించుకుని కేంద్ర ప్రభుత్వం ముందు తమ డిమాండ్లు పెట్టి నెరవేర్చుకుంటున్నదని చెప్పారు. నిజంగానే టీడీపీపై ఈ అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రత్యేక హోదాపై టీడీపీ మౌనం దాల్చడం మాత్రం చర్చనీయాంశమవుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యూహం ఏమిటి? నేరుగా పార్లమెంటులోనే ఈ అంశాన్ని లేవనెత్తుతారా? లేక సానుకూలంగా కేంద్రం పెద్దలతో చర్చించి డిమాండ్‌ను సాధించుకుంటారా? అనే చర్చలు జరుగుతున్నాయి.

Also Read: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. వైసీపీ డిమాండ్

వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయడమే కాదు.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అల్లకల్లోలం సృష్టిస్తున్నదని, దీనిపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

సభా మర్యాదను అందరూ కాపాడాలని, ఉభయ సభలు సజావుగా సాగడానికి ప్రతిక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అలాగైతే ప్రతిపక్షాలు పార్లమెంటులో తమ గళాన్ని వినిపించడానికి అనుమతించాలని, పార్లమెంటులో సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ్ గొగోయ్ స్పష్టం చేశారు.

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×