E-Paper
Advertisement

JoshiMath sinking | జోషిమఠ్‌లో అంతా మన్నే?

JoshiMath sinking | జోషిమఠ్‌లో భూఉపరితలం నుంచి 80 మీటర్ల దిగువన కూడా గట్టి రాయి లేనే లేదు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని ఈ పట్టణం క్రమేపీ కుంగిపోతున్న సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గురవుతున్న జోషిమఠ్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(PWD) తాజా సర్వే చేపట్టింది. హిమానీ మృత్తిక(moraine)పై పట్టణం నిర్మితం కావడమే కుంగుబాటుకు కారణమన్న గత అంచనాలను సర్వే ప్రాథమిక పరిశీలన ధ్రువీకరిస్తోంది.

JoshiMath sinking | జోషిమఠ్‌లో అంతా మన్నే?

JoshiMath sinking | జోషిమఠ్‌లో భూఉపరితలం నుంచి 80 మీటర్ల దిగువన కూడా గట్టి రాయి లేనే లేదు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని ఈ పట్టణం క్రమేపీ కుంగిపోతున్న సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గురవుతున్న జోషిమఠ్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(PWD) తాజా సర్వే చేపట్టింది. హిమానీ మృత్తిక(moraine)పై పట్టణం నిర్మితం కావడమే కుంగుబాటుకు కారణమన్న గత అంచనాలను సర్వే ప్రాథమిక పరిశీలన ధ్రువీకరిస్తోంది.

వర్టికల్ సింకింగ్‌కు గల అవకాశాలు, అందుకు పరిష్కరాలు ఏమిటన్న అంశాలపై సర్వే ప్రధానంగా దృష్టి సారించింది. అలా నిలువునా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉన్న ఆరు ప్రాంతాలను సర్వే ప్రాథమికంగా గుర్తించింది. ఆ ఆరు ప్రాంతాలు అత్యంత ఎత్తులో ఉన్నాయి.

కొట్టుకువచ్చిన రాళ్లు, మట్టిపైనే జోషిమఠ్ నిర్మాణం జరిగిందని కేంద్ర సాంకేతిక సంస్థలు ఇప్పటికే అప్రమత్తం చేశాయి. ఆయా సంస్థల నివేదికల ఆధారంగా పీడబ్ల్యూడీ జియోటెక్నికల్ సర్వే కుంగుబాటు ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించింది. 80 మీటర్ల దిగువకి కూడా హార్డ్ రాక్ అన్నదే లేదన్న విషయం తొలి ప్రాంతంలోనే తేలిందని పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు.

రెండో ప్రాంతాన్ని సర్వే బృందం పరిశీలించనుంది. అనంతరం మిగిలిన నాలుగు సైట్లలోనూ సర్వే నిర్వహిస్తారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం లేకుండా చూసేందుకు ఈ సర్వే ఉపయోగపడగలదు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×