E-Paper
Advertisement

K Ponmudy | విద్యాశాఖ మంత్రి, భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష

K Ponmudy | విద్యాశాఖ మంత్రి, భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష

K Ponmudy | తమిళనాడు విద్యాశాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత కె పొన్ముడి, ఆయన భార్యకు గురువారం మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో మంత్రి దంపతులకు కోర్టు ఈ శిక్ష విధించింది. పైగా రూ. 50 లక్షలు చొప్పున ఇద్దరూ జరిమానా కూడా చెల్లించాలని తీర్పు వెలువరించింది.

2006 సంవత్సరం నుంచి 2011 వరకు ఖనిజ శాఖ మంత్రిగా ఉన్న పొన్ముడి కోట్లు విలువ చేసే అక్రమాస్తులను కూటబెట్టుకున్నారనే కేసులో మద్రాస్ కోర్టు మంత్రి పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షికి డెసెంబర్ 19న దోషిగా తేల్చింది. ఈ కేసులో గురువారం దంపతులిద్దరికీ మూడేళ్ల జైలు, ఒక్కొక్కొరికి రూ.50 లక్షలు జరిమానా విధించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు దంపతులిద్దరికీ 30 రోజుల గడువు విధించింది.

ఈ కేసులో మంత్రి పొన్ముడి వయసు(73), ఆరోగ్య కారణాలు చూపుతూ మినహాయింపు కోరినా కోర్టు ఈ కారణాలను తోసిపుచ్చింది.

ఇంతకు ముందు ఇదే కేసులో ఒక సెషన్స్ కోర్టు 2016 సంవత్సరంలో ఇద్దరూ నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. కానీ విజిలెన్స్ అధికారులు ఈ కేసుని హైకోర్టులో సవాల్ చేశారు.

రనే కేసులో పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు ఈనెల 19న దోషిగా తేల్చింది. ఇదే కేసు నుంచి వారిద్దరికీ విముక్తి కల్పిస్తూ 2016లో దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అయితే, ఆగస్టు నెలలో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ఆయన పైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు హైకోర్టు 30 రోజుల గడువు విధించింది.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×