E-Paper
Advertisement

CM Jagan : విద్యార్థులకు ట్యాబ్స్‌ పంపిణీ.. విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై జగన్ ఫైర్..

CM Jagan

CM Jagan : విద్యార్థులకు ట్యాబ్స్‌ పంపిణీ.. విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై జగన్ ఫైర్..
Advertisement

CM Jagan : విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇక్కడి నుంచే ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

కాగా వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది.పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ప్రేమానురాగాల మధ్య, ఆప్యాయతల మధ్య జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని జగన్ తెలిపారు. 55 నెలలుగా ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా వేశామని… పిల్లలకు అవసరమైన బైజుస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు జగన్.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×