BigTV English
Advertisement

Kejriwal Petition Dismissed: ఆప్ అధినేతకు చుక్కెదురు.. కేజ్రీవాల్‌‌ పిటిషన్ తిరస్కరణ..!

Kejriwal Petition Dismissed: ఆప్ అధినేతకు చుక్కెదురు.. కేజ్రీవాల్‌‌ పిటిషన్ తిరస్కరణ..!
Kejriwal Verdict By Delhi High Court in Liquor Scam
Kejriwal Verdict By Delhi High Court in Liquor Scam

CM Arvind Kejriwal Petition Dismissed By Delhi High Court in Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి ఈడీ వద్ద తగినంత ఆధారం ఉందని మంగళవారం కోర్టు స్పష్టం చేసింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.


కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి దారితీసిన తగినంత మెటీరియల్‌ ఈడీ వద్ద ఉందని.. కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాకపోవడం.. ఆయన వల్ల జరిగిన జాప్యం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారిపై కూడా ప్రభావం చూపిందని ఢిల్లీ హైకోర్టు ఆప్ అధినేత అరెస్టు ఆవశ్యకతపై మంగళవారం తీర్పునిచ్చింది.

ఢిల్లీ హైకోర్టు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉంటుందని.. రాజకీయ నైతికతకు కాదని స్పష్టం చేసింది. కోర్టు రాజకీయాల జోలికి వెళ్లదని పేర్కొంది. అరెస్టు సమయాన్ని ఈడీ నిర్ణయించినట్లు తాను భావించలేమని.. నిందితుల అరెస్ట్ చట్ట ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని.. ఎన్నికల సమయం ప్రకారం కాదని స్పష్టం చేసింది.


Also Read: Court dismisses Kejriwal petition: కేజ్రీవాల్‌కు మరో షాక్, ఇక సుప్రీంకోర్టుకు..

కోర్టు వివిధ కేటగిరీలకు చట్టాలు రూపొందించదని.. చట్టం అందరికీ ఒకే లా ఉంటుందని.. సీఎంగా తనకు ఎలాంటి ఇమ్యూనిటీ లేదని స్పష్టం చేసింది.

అరవింద్ కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఉత్తర్వుతో సహా ట్రయల్ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కూడా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సమర్థించారు.

లిక్కర్ పాలసి రూపకల్పన, మనీలాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని పేర్కొంది.

తమ ముందున్న అంశం కేజ్రీవాల్, దర్యాప్తు సంస్థ ఈడీ మధ్య అని.. కేంద్ర ప్రభుత్వానికి, కేజ్రీవాల్ మధ్య వివాదం కాదని కోర్టు పేర్కొంది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×