E-Paper
Advertisement

Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత..

Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత..

Oommen Chandy death news(Telugu news headlines today): కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చాందీ బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రకటించారు. గతంలో గొంతు సమస్యలతో చాందీ హాస్పటల్ చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ హాస్పటల్ లో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కేరళలోని కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో 1943 అక్టోబర్ 31న ఊమెన్‌ చాందీ జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎంతో కష్టపడి పనిచేసి పార్టీ అధిష్టానాన్ని మెప్పించారు. 27 ఏళ్లకే పూతుపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. అలా 1970 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం పోటీ చేస్తూ వచ్చారు. ఇలా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఊమెన్ చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కేరళ సీఎం పదవిని చేపట్టారు. 2004- 2006, 2011- 2016లో రెండుసార్లు సీఎం బాధ్యతలను నిర్వహించారు.

ఊమెన్ చాందీ 5 దశాబ్దాల రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే సాగింది. ఆయన ఎప్పుడూ మరో పార్టీ వంక చూడలేదు. కాంగ్రెస్ కు విశ్వాసపాత్రుడిగానే ఉండిపోయారు. ఈ అంశాలే ఆయనను కేరళకు రెండుసార్లు సీఎం అయ్యే అవకాశం కల్పించాయి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×