E-Paper
Advertisement

Congress: సోనియా ఇంటికి రైతులు.. కలిసి భోజనం, డ్యాన్సులు.. మార్పు మంచికే..

Congress: సోనియా ఇంటికి రైతులు.. కలిసి భోజనం, డ్యాన్సులు.. మార్పు మంచికే..
sonia gandhi dance

Sonia Gandhi news today(Latest congress news in India): గాంధీ కుటుంబం. ప్రాణాలకు ముప్పు ఉండటంతో.. దశాబ్దాల తరబడి NSG రక్షణలోనే ఉండిపోయారు. నిత్యం గన్‌మెన్ల పహారాలోనే. ఎక్కడికి వెళ్లినా అత్యంత టైట్ సెక్యూరిటీ. కనీసం ప్రజలకు సమీపంగా కూడా వెళ్లనిచ్చేవారు కాదు. దీంతో గాంధీ ఫ్యామిలీకి.. పబ్లిక్‌కు మధ్య ఓ గ్యాప్ ఎప్పుడూ ఉంటూనే ఉండేది. భారత్ జోడో యాత్రతో ఆ రేఖను తుడిచేశారు రాహుల్‌గాంధీ. సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతూనే.. దేశప్రజలకు అత్యంత చేరువయ్యారు. ఈ మార్పు కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేసింది. అది మరింత కంటిన్యూ చేస్తూ.. రాహుల్ ఆకస్మిక పర్యటనలతో జనం హృదయాల్లోకి చొచ్చుకెళుతున్నారు. తనతో పాటు పార్టీని ప్రజలకు కొత్తగా పరిచయం చేస్తున్నారు. మార్పు మంచిదే అన్నట్టు.. లేటెస్ట్‌గా సోనియాగాంధీ సైతం సాధారణ రైతులతో కలిసిపోయారు. ఏకంగా సోనియా ఇంటికే ఆ మహిళలు అతిథిలుగా వచ్చారు. గాంధీ ఫ్యామిలీతో కులాసాగా గడిపారు. కలిసి భోజనం చేశారు. కలిసి డ్యాన్సులు కూడా చేశారు. ఈ దృశ్యం.. నెవ్వర్ బిఫోర్. ఈ క్రెడిట్ మొత్తం రాహుల్‌గాంధీకే.

ఇటీవల హర్యానాలో పర్యటించారు రాహుల్‌ గాంధీ. ఆసమయంలో మహిళా రైతులతో కలిసి వరినాట్లు వేసిన రాహుల్.. వారితో చాలాసేపు ముచ్చటించారు. వారి కష్టసుఖాలతో పాటు కోరికలను తెలుసుకున్నారు. ఆ సందర్భంలో ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలని ఉందంటూ మహిళా రైతులు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే, తన ఇంటిని ప్రభుత్వం తీసేసుకుందని చెప్పిన రాహుల్.. తన తల్లి సోనియా గాంధీ ఇంటికి వారిని ఆహ్వానించారు.

జస్ట్ పిలవడమే కాదు.. వారి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. హర్యానాలోని సోనిపట్ నుంచి ఢిల్లీకి ఆ మహిళా రైతులను తీసుకొచ్చారు. సోనియా నివాసంలో గాంధీ కుటుంబంతో మమేకమయ్యారు. ప్రియాంక, రాహుల్, సోనియాలతో కలిసి భోజనం చేశారు. వారి కష్టసుఖాలు చెప్పుకున్నారు. భోజనం తర్వాత గార్డెన్‌లో.. ఆ మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేశారు సోనియా, ప్రియాంక. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది కాంగ్రెస్.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×