E-Paper
Advertisement

Sabarimala: శబరిమలలో మళ్లీ రచ్చ.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి, రంగంలోకి పోలీసులు

Sabarimala: శబరిమలలో మళ్లీ రచ్చ..  తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి, రంగంలోకి పోలీసులు
Advertisement

Sabarimala: కేరళలోని శబరిమల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లోకి వస్తోంది. అక్కడికి వెళ్లిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెలుగు వ్యక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇంతకీ అసలు అక్కడేం జరిగింది?

శబరిమలలో మళ్లీ రచ్చ

Advertisement

శుక్రవారం శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు భక్తులపై అక్కడి వ్యాపారులు దాడులు చేస్తున్నారు. ఓ షాపు ఓనర్.. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టడం మళ్లీ రచ్చగా మారింది. వాటర్‌ బాటిల్‌ ధర ఎక్కువ ఉందని ప్రశ్నించడమే ఆ భక్తుడి తప్పయ్యింది. దీనిపై తెలుగు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో షాపు వద్ద నిల్చుని అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. షాపు వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. స్థానిక మిగతా షాపుల ఓనర్లు భక్తులపై ఎదురు తిరిగారు. దీనిపై ఏపీ-తెలంగాణకు చెందిన తెలుగు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

Advertisement

తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి

భక్తులను, వ్యాపారులను అక్కడిని పంపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్థానిక వ్యాపారస్తులకు పోలీసులు మద్దుతుగా ఉండటాన్ని మండిపడుతున్నారు. ఈ  వ్యవహారానికి  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.  ప్రతీ ఏడాది ఈ సీజన్‌‌లో శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అధికంగా ఉంటారు.

శబరిమలలో రద్దీ అనుగుణంగా అక్కడి అధికారులు ఏర్పాట్లు చేయలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి కనీస సౌకర్యాలు సరిగా లేవని, స్థానికులు మర్యాదగా ప్రవర్తించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటీవల పోలీసు అధికారి తెలుగు భక్తులు అసభ్యకరంగా మాట్లాడారు. తాజాగా ఇప్పుడు స్థానిక వ్యాపారులు దాడి వంతైంది.

ALSO READ: రష్యా అధ్యక్షుడు పుతిన్ బస అక్కడే.. ఒక్కరాత్రికి ఎంతో తెలుసా?

 

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×