E-Paper
Advertisement

AD Srinivasulu Arrest: ఏసీబీ వలలో రూ.100 కోట్ల.. అవినీతి తిమింగలం

AD Srinivasulu Arrest: ఏసీబీ వలలో రూ.100 కోట్ల.. అవినీతి తిమింగలం
Advertisement

AD Srinivasulu Arrest: రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు ఇంచార్జీగా పనిచేస్తున్న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాసులు భారీ అవినీతి ఆరోపణల కేసులో చిక్కుకున్నారు. అక్రమ లావాదేవీలు, ప్రభుత్వ భూముల అనధికార  బదలాయింపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకారం వంటి అంశాల్లో ఏసీబీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో.. అధికారులను అతన్ని రిమాండ్‌కు తరలించారు.

ఏసీబీ విచారణలో భాగంగా శ్రీనివాసులు అనేక మార్పిడి లావాదేవీలకు కేంద్రబిందువుగా ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. ముఖ్యంగా తప్పుడు సర్వే నంబర్లతో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు పేర్లపై నమోదు చేయించడంలో కీలక పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు. ప్రతి అనధికార బదలాయింపు వెనుక భారీ లంచాల వ్యవహారం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది.

Advertisement

వివరాల ప్రకారం.. శ్రీనివాసులు ఈ అక్రమ లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలను లంచాల రూపంలో స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్లలో మార్పులు చేయడం నుండి భూ హక్కులను అనధికారంగా బదిలీ చేయడం వరకు అనేక అక్రమ చర్యల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ వ్యవహారం గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వచ్చింది. రంగనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసులు, కొంత మంది అధికారులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఆయన 2023 ఆగస్టులోనే సైబరాబాద్ సీపీకి సంప్రదించి, నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువు FTL, బఫర్ జోన్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ నిర్మాణాలకు శ్రీనివాసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

రంగనాథ్ చేసిన ఆ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ EOW పోలీసులు శ్రీనివాసులు సహా పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఏసీబీ దృష్టికి వెళ్లిన తర్వాత దర్యాప్తు మరింత వేగం పెరిగింది.

కేసుతో పాటు బుధాన్ భూముల అక్రమ బదిలీల్లో కూడా శ్రీనివాసులు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన సహకారం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ చట్టబద్ధ మార్గంలో జరగాల్సినప్పటికీ, నకిలీ రికార్డులు తయారు చేసి భూముల విలువను మార్చి చూపినట్టు దర్యాప్తులో తేలిన వివరాలు.

దర్యాప్తు సందర్భంగా ఏసీబీ బృందాలు భారీగా రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాయి. భూముల పునర్నిర్మాణం, సర్వే నంబర్ల మార్పులు, అక్రమ బదిలీలు, లంచాల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ముఖ్య ఆధారాలుగా ఏసీబీ ఎదుట నిలిచాయి. ఈ పత్రాలు మొత్తం అవినీతి వ్యవస్థ ఎంత పెద్దదో బయటపెడుతున్నట్టు అధికారులు తెలిపారు.

శ్రీనివాసులు పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఆస్తుల విలువ కూడా ఏసీబీని ఆశ్చర్యపరచింది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రాథమిక సమాచారం. ఈ ఆస్తుల మూలాలు, వాటి కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ ఏసీబీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.

Also Read: ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన

 

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×