BigTV English
Advertisement

Election Commission Transfers: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ!

Election Commission Transfers: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ!

Election Commission Transfers Odisha Bureaucrat Sujata: ఆ రాష్ట్రంలో ఆమె ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిణి. అయితే, ఆమెపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు వచ్చిన గంటలోనే ఎన్నికల సంఘం ఆ అధికారిణిని బదిలీ చేసింది. ప్రజా వ్యవహారాలకు సంబంధం లేని డిపార్టుమెంటుకు వెంటనే బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.


ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికల వేళ ఒడిశా రాష్ట్రంలో ఓ అధికారిణిని బదిలీపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుల్లో ఒకరు వీకే పాండియన్. అయితే, ఆయన సతీమణి సుజాత ప్రభుత్వ ఉన్నతాధికారిణి. ఆమె మిషన్ శక్తి విభాగంలో కమిషనర్ కమ్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమెపై ఈసీకి స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆమె రాష్ట్రంలో బీజేడీ ఏజెంట్ గా పని చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. గంటలోనే ఆమెను బదిలీ చేసింది. అది కూడా ప్రజా వ్యవహారాలకు సంబంధంలేనటువంటి విభాగానికి తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె బదిలీ విషయమై ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Also Read: Newborn hurled: శిశువును రోడ్డుపై విసిరేసిన యువతి.. ఆమెను పోలీసులకు పట్టిచ్చిన పార్శిల్ కవర్


అయితే, ఇది ఇలా ఉంటే.. సుజాత భర్త వీకే పాండియన్ కూడా ఐఏఎస్ అధికారే. అయితే, ఆయన గత ఏడాది స్వచ్ఛంద ఉద్యోగ విరణ చేశారు. ఆ తరువాత బీజేడీలో చేరారు. నవీన్ పట్నాయక్ సన్నిహితుల్లో ఒకరుగా పాండియన్ కు పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి బదిలీ విషయమై తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×