E-Paper
Advertisement

Election Commission Transfers: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ!

Election Commission Transfers: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ!

Election Commission Transfers Odisha Bureaucrat Sujata: ఆ రాష్ట్రంలో ఆమె ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిణి. అయితే, ఆమెపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు వచ్చిన గంటలోనే ఎన్నికల సంఘం ఆ అధికారిణిని బదిలీ చేసింది. ప్రజా వ్యవహారాలకు సంబంధం లేని డిపార్టుమెంటుకు వెంటనే బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికల వేళ ఒడిశా రాష్ట్రంలో ఓ అధికారిణిని బదిలీపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుల్లో ఒకరు వీకే పాండియన్. అయితే, ఆయన సతీమణి సుజాత ప్రభుత్వ ఉన్నతాధికారిణి. ఆమె మిషన్ శక్తి విభాగంలో కమిషనర్ కమ్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమెపై ఈసీకి స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆమె రాష్ట్రంలో బీజేడీ ఏజెంట్ గా పని చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. గంటలోనే ఆమెను బదిలీ చేసింది. అది కూడా ప్రజా వ్యవహారాలకు సంబంధంలేనటువంటి విభాగానికి తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె బదిలీ విషయమై ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Also Read: Newborn hurled: శిశువును రోడ్డుపై విసిరేసిన యువతి.. ఆమెను పోలీసులకు పట్టిచ్చిన పార్శిల్ కవర్

అయితే, ఇది ఇలా ఉంటే.. సుజాత భర్త వీకే పాండియన్ కూడా ఐఏఎస్ అధికారే. అయితే, ఆయన గత ఏడాది స్వచ్ఛంద ఉద్యోగ విరణ చేశారు. ఆ తరువాత బీజేడీలో చేరారు. నవీన్ పట్నాయక్ సన్నిహితుల్లో ఒకరుగా పాండియన్ కు పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి బదిలీ విషయమై తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Tags

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×