E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: తొలి విడత ఎన్నికల్లో.. 252 మంది అభ్యర్థులు నేరస్తులే.. కోటీశ్వరుల సంఖ్య ఎంతంటే..?

Lok Sabha Elections 2024: తొలి విడత ఎన్నికల్లో.. 252 మంది అభ్యర్థులు నేరస్తులే.. కోటీశ్వరుల సంఖ్య ఎంతంటే..?
Advertisement
Lok Sabha Elections:
Lok Sabha Elections:

Lok Sabha Elections 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన సరే ఎన్నికల హడావుడినే కనిపిస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా సరే.. ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థుల గురించే చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ ఓ నివేదికను విడుదుల చేసింది. ఈ విశ్లేషణ ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో సగం మంది నేర చరితులు ఉన్నవారేనని వారు దాఖలు చేసిన అఫిడివిట్ ఆధారంగా వెల్లడించింది.

ఈ లోక్ సభ ఎన్నికల తొలి దశలో దాదాపు సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై నేర పూరితమైన కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది నేర చరితులైన అభ్యర్థులే ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచారని తెలిపింది.

Advertisement

మొత్తం దేశవ్యాప్తంగా దాఖలైన 1618 మంది ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయని వెల్లడించింది. 35 మంది పోటీ దారులపై విద్వేష ప్రసంగాల కేసులున్నాయని స్పష్టం చేసింది.

Also Read: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి..!

Advertisement

ప్రస్తుతం జరగబోయే తొలి విడత ఎన్నికల్లో 41 శాతం సీట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించాలని ఏడీఆర్ సూచించింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో 28 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని ప్రటకటించింది. ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ అభ్యర్థుల్లో 40 శాతం మంది ఏదో ఒక నేరానికి పాల్పడిన వారేనని తన విశ్లేషణలో వెల్లడించింది.

Tags

Related News

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

Big Stories

Advertisement
×