LPG Gas e-Kyc: పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్పీజీ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ కస్టమర్లు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ (ఈ-కేవైసీ) పూర్తి చేయాలని సూచించింది. గ్యాస్ సరఫరాను సులభతరం చేయడానికి వినియోగదారులు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్లో… ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్లను ఉపయోగించి ఇంటి వద్ద ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. ఎల్పీజీ డిస్టిబ్యూటర్ ను సందర్శించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ-కెవైసీని పూర్తి చేయకపోతే ఎల్పీజీ రీఫిల్ చేయడంలో అంతరాయం ఏర్పడవచ్చు లేదా సబ్సిడీలు ఆగిపోచవచ్చు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఈ-కేవైసీ మరింత కఠినతరం చేశారు. సబ్సిడీ పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో.. మొదటి సిలిండర్ తీసుకునే ముందు బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. తొమ్మిది నెలలకు పైగా రీఫిల్ బుక్ చేసుకోని కస్టమర్లు.. కొత్త సిలిండర్ బుక్ చేసుకునే ముందు డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో స్వయంగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో… గ్యాస్ సరఫరాపై ఒత్తిళ్లు పెరిగాయి. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వను అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. నిజమైన వినియోగదారులకు గ్యాస్ పంపిణీ అయ్యేలా, సబ్సిడీలు చేరేలా ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది.
ఎల్పీజీ పరిస్థితులు ఇంకా ఆందోళకరంగానే ఉందని కేంద్రం తెలిపింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద నిల్వలు ఉన్నాయని, పంపిణీకి ఆటంకంలేదని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు మాత్రమే కేవైసీ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేస్తే మళ్లీ చేయాల్సిన అవసరంలేదని తెలిపింది. ఏడాదికి ఒకసారి ఈ కేవైసీ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఉజ్వల లబ్దిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది. 8, 9వ రీఫిల్స్ పై సబ్సిడీ పొందడానికి ఇది తప్పనిసరి అని పేర్కొంది.
Also Read: గ్యాస్ కష్టాలకు చెక్.. భారత తీరానికి నందాదేవి రాక!