E-Paper
Advertisement

బెం సొంత కోట భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఘోర పరాజయం.. పోలింగ్ బూత్ లో ఆమెను కొట్టారా?

బెం సొంత కోట భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఘోర పరాజయం.. పోలింగ్ బూత్ లో ఆమెను కొట్టారా?
Advertisement

Mamata Banerjee is beaten inside booth: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత కంచుకోట అయిన భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ సీనియర్ నేత.. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సుమారు 15,105 ఓట్ల భారీ మెజార్టీతో ఆమెపై చారిత్రాత్మక విజయం సాధించారు. గతంలో నందిగ్రామ్‌లోనూ మమతను ఓడించిన సువేందు.. ఇప్పుడు భవానీపూర్‌లోనూ ‘జెయింట్ కిల్లర్’గా నిలిచి ఆమె రాజకీయ ప్రస్థానానికి పెద్ద షాక్ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలోకి రావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లోపల తనపై దాడి జరిగిందని, తనను కొట్టారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. ఈ ఫలితాలను తాను అంగీకరించబోనని.. ఇది నైతిక విజయం కాదని ఆమె తెగేసి చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని.. బీజేపీ వందకు పైగా స్థానాలను దౌర్జన్యంగా దోచుకుందని ఆమె ఆరోపణలు చేశారు.

Advertisement

“దీనిని మీరు విజయమని భావిస్తున్నారా? ఇది అనైతిక విజయం. ఎన్నికల సంఘం ఇప్పుడు బీజేపీ కమిషన్‌లా మారిపోయింది. ఇదంతా లూటీ.. లూటీ.. లూటీ మాత్రమే! మేము మళ్లీ పుంజుకుంటాం.. పోరాటం ఆపం” అని మమత వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని.. మనోజ్ అగర్వాల్ వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానిపూర్‌లో పరిస్థితి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. తన మాజీ సహచరుడు.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే.. సువేందు 6,226 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

Advertisement

Read Also: కేరళంలో యూడీఎఫ్ అద్భుత విజయం.. ఎర్రకోటలు బద్దలయ్యాయి, కేసీ వేణుగోపాల్ సంచలనం

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×