E-Paper
Advertisement

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 9మంది మృతి.. తీవ్ర ఉద్రిక్తత..

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 9మంది మృతి.. తీవ్ర ఉద్రిక్తత..
manipur firing

Manipur Violence: మణిపుర్‌ మళ్లీ అట్టుడికిపోతోంది. తీవ్ర హింస చెలరేగింది. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 9 మంది చనిపోయారు. ఒకరు పరిస్థితి సీరియస్‌గా ఉంది.

ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యాధికారులు తెలిపారు.

ఉగ్రవాదులకు చెందిన తాత్కాలిక బంకర్లు, వారు నిర్మించుకున్న నిఘా టవర్‌ను గ్రామ వాలంటీర్లు దహనం చేశారని పోలీసులు తెలిపారు.

బిష్ణుపుర్‌ జిల్లాలోని గోవింద్‌పుర్‌ గ్రామంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

మణిపుర్‌లో గత కొన్ని రోజులుగా మైతీ-కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల్లో కనీసం 100 మంది పౌరులు మృతి చెందగా 310 మంది గాయపడ్డారు.

హింసాత్మక ఘటనలతో కర్ఫ్యూ సమయం మరింత పెంచారు. ఆంక్షలను కఠినతరం చేశారు. మణిపూర్.. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే హైటెన్షన్ నెలకొంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×