E-Paper
Advertisement

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 9మంది మృతి.. తీవ్ర ఉద్రిక్తత..

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 9మంది మృతి.. తీవ్ర ఉద్రిక్తత..
Advertisement
manipur firing

Manipur Violence: మణిపుర్‌ మళ్లీ అట్టుడికిపోతోంది. తీవ్ర హింస చెలరేగింది. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 9 మంది చనిపోయారు. ఒకరు పరిస్థితి సీరియస్‌గా ఉంది.

ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

ఉగ్రవాదులకు చెందిన తాత్కాలిక బంకర్లు, వారు నిర్మించుకున్న నిఘా టవర్‌ను గ్రామ వాలంటీర్లు దహనం చేశారని పోలీసులు తెలిపారు.

బిష్ణుపుర్‌ జిల్లాలోని గోవింద్‌పుర్‌ గ్రామంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Advertisement

మణిపుర్‌లో గత కొన్ని రోజులుగా మైతీ-కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల్లో కనీసం 100 మంది పౌరులు మృతి చెందగా 310 మంది గాయపడ్డారు.

హింసాత్మక ఘటనలతో కర్ఫ్యూ సమయం మరింత పెంచారు. ఆంక్షలను కఠినతరం చేశారు. మణిపూర్.. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే హైటెన్షన్ నెలకొంది.

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. గుజరాత్‌లో ఘటనపై

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×