BigTV English

Mumbai : 31 ఏళ్ల క్రితం తప్పించుకున్న నిందితుడు.. పోలీసులకు పట్టించిన భార్య ఫోన్ కాల్..

Mumbai : 31 ఏళ్ల క్రితం తప్పించుకున్న నిందితుడు.. పోలీసులకు పట్టించిన భార్య ఫోన్ కాల్..

Mumbai : భార్య చేసిన ఒక ఫోన్ కాల్ 31 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులకు దొరికేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబయికి చెందిన దీపక్ నారాయణ్ భీసే అనే వ్యక్తి 1989లో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడు. 1992లో ఇతనికి బెయిల్ మంజూరయ్యింది. దీపక్ నారాయణ్ అప్పటి నుంచి కోర్టు విచారణకు హాజరుకాలేదు. 2003లో కోర్టు ఇతను పరారీలో ఉన్నట్టు ప్రకటించింది. అతని ఆచూకీ కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.


పోలీసులు దీపక్ స్వగ్రామానికి వెళ్లి విచారణ చేపట్టినప్పుడల్లా చనిపోయి ఉంటాడని స్థానికులు తెలిపేవారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా దీపక్ భార్య ఫోన్ నంబర్ సంపాదించారు. ఫోన్ నంబర్ ద్వారా ట్రాక్ చేసి ముంబయికి 60 కి.మీల దూరంలో ఉన్న నాలాసొపార గ్రామంలో దీపక్ ను పట్టుకున్నారు. 31 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాలు మార్చాడు. చివరికి తన భార్య, ముగ్గురు పిల్లలతో రెండేళ్లుగా నాలాసొపారాలో జీవిస్తున్నాడు. భార్య ఫోన్ కాల్ ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×