E-Paper
Advertisement

Mumbai : 31 ఏళ్ల క్రితం తప్పించుకున్న నిందితుడు.. పోలీసులకు పట్టించిన భార్య ఫోన్ కాల్..

Mumbai : 31 ఏళ్ల క్రితం తప్పించుకున్న నిందితుడు.. పోలీసులకు పట్టించిన భార్య ఫోన్ కాల్..

Mumbai : భార్య చేసిన ఒక ఫోన్ కాల్ 31 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులకు దొరికేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబయికి చెందిన దీపక్ నారాయణ్ భీసే అనే వ్యక్తి 1989లో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడు. 1992లో ఇతనికి బెయిల్ మంజూరయ్యింది. దీపక్ నారాయణ్ అప్పటి నుంచి కోర్టు విచారణకు హాజరుకాలేదు. 2003లో కోర్టు ఇతను పరారీలో ఉన్నట్టు ప్రకటించింది. అతని ఆచూకీ కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

పోలీసులు దీపక్ స్వగ్రామానికి వెళ్లి విచారణ చేపట్టినప్పుడల్లా చనిపోయి ఉంటాడని స్థానికులు తెలిపేవారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా దీపక్ భార్య ఫోన్ నంబర్ సంపాదించారు. ఫోన్ నంబర్ ద్వారా ట్రాక్ చేసి ముంబయికి 60 కి.మీల దూరంలో ఉన్న నాలాసొపార గ్రామంలో దీపక్ ను పట్టుకున్నారు. 31 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాలు మార్చాడు. చివరికి తన భార్య, ముగ్గురు పిల్లలతో రెండేళ్లుగా నాలాసొపారాలో జీవిస్తున్నాడు. భార్య ఫోన్ కాల్ ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×