BigTV English
Advertisement

Minister Vidadala Rajini: కార్యాలయంపై దాడి ఘటన.. “గుణపాఠం చెబుతాం”.. మంత్రి విడదల రజని వార్నింగ్..

Minister Vidadala Rajini:  కార్యాలయంపై దాడి ఘటన.. “గుణపాఠం చెబుతాం”.. మంత్రి విడదల రజని వార్నింగ్..

Minister Vidadala Rajini: గుంటూరులో న్యూ ఇయర్‌ సంబరాల్లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. చంద్రమౌళి నగర్‌లో ప్రారంభానికి సిద్ధమైన వైసీపీ ఆఫీస్‌ మీద దాడి చేశారు. రాళ్లు విసరడంతో.. అద్దాలు పగిలిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.


గుంటూరు వెస్ట్‌ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మంత్రి విడదల రజని.. కొత్త ఏడాది సందర్భంగా చంద్రమౌళి నగర్లో వైసీపీ ఆఫీస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అర్థరాత్రి న్యూ ఇయర్‌ సందర్భంగా ర్యాలీ తీసిన వారిలో కొందరు దుండగులు.. వైసీపీ ఆఫీస్‌పై రాళ్లు విసిరారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అందరినీ చెదరగొట్టి, 50 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కార్యాలయంపై జరిగిన దాడిపై మంత్రి విడదల రజిని స్పందించారు. సోమవారం ఉదయం పార్టీ ఆఫీసును పరిశీలించిన ఆమె.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది పక్కా ప్లాన్ తో జరిగిన దాడి అని, దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలన్నారు. ఈ దాడి ఘటన వెనుక ఉన్నవారందరికీ గుణపాఠం చెబుతామన్నారు.


ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్న తన కార్యాలయంపైనే దాడి చేశారంటే.. వాళ్లకు బీసీలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుందన్నారు. పక్కప్రణాళికతో దాడి చేశారు కాబట్టే.. లాఠీఛార్జ్ చేసినా దాడిని కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దారి గిరి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు జయహో బీసీ అంటూనే.. మరోవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని, నిందితుల్ని శిక్షించాలని కోరారు.

.

.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×