E-Paper
Advertisement

National Herald Case: గాంధీ కుటుంబానికి బిగించిన ఉచ్చు: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు..

National Herald Case: గాంధీ కుటుంబానికి బిగించిన ఉచ్చు: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు..
Advertisement

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై FIR నమోదైంది. ఈ కీలక పరిణామంతో ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి క్రిమినల్ కుట్ర అభియోగాలు నమోదు చేశారు.

తాజా FIRలో శ్యామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తులు…
మరో ఆరుగురిపైనా ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కొత్త FIR నమోదు చేసింది. ED ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్‌ 3న FIR నమోదు చేశారు. తాజా FIRలో శ్యామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తులు సహా… అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్, డొటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 కంపెనీల పేర్లు ఉన్నాయి.

Advertisement

క్రిమినల్ కుట్ర జరిగిందనే ఆరోపణలతో FIR నమోదు
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే మాతృసంస్థ AJLను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి… క్రిమినల్ కుట్ర జరిగిందనే ఆరోపణలతో FIR నమోదైంది. కోల్‌కతాలో ఉన్నట్లు ఆరోపిస్తున్న డొటెక్స్ మర్చండైజ్ అనే షెల్ కంపెనీ నుంచి యంగ్ ఇండియన్ అనే కంపెనీకి… కోటి రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సోనియా, రాహుల్‌కు కలిపి 76 శాతం వాటా..
యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్‌కు కలిపి 76 శాతం వాటా ఉంది. కోటి రూపాయల లావాదేవీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి యంగ్ ఇండియన్ కంపెనీ 50 లక్షలు చెల్లించి.. సుమారు రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఏజేఎల్‌పై నియంత్రణ సాధించిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.

Advertisement

ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్
ఈ కేసు విషయమై కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ స్పందించారు. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంపై నిరంతరం బెదిరింపులు, రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: కాచిగూడ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్.. డివైడర్‌ని ఢీకొన్న బైక్, ఆపై స్పాట్‌లో

చివరికి న్యాయమే గెలుస్తుంది..
అభద్రత, భయంతో ఉన్నవారు మాత్రమే ఇతరులను బెదిరించడానికి ప్రయత్నిస్తారని అన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందని.. సత్యమేవ జయతే అంటూ ఆయన ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థలు తీసుకుబోయే తదుపరి చర్యలు ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×