BigTV English
Advertisement

NTCA Data : పులుల దాడుల్లో 349 మంది మృతి.. నివేదిక విడుదల చేసిన NTCA

NTCA Data : పులుల దాడుల్లో 349 మంది మృతి.. నివేదిక విడుదల చేసిన NTCA

NTCA Data : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలిపింది. గడిచిన ఐదేళ్లలో దేశంలో పులుల మరణాలు పెరిగినట్లు నివేదికలో వివరించింది. వేట, అనారోగ్యం, వివిధ కారణాల వల్ల 628 పులులు చనిపోగా.. పులుల దాడిలో గత ఐదేళ్లలో 349 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. చనిపోయినవారిలో 200 మంది మధ్యప్రదేశ్ వాళ్లే ఉన్నట్లు తెలిపింది. 2023లో పులుల మరణాలు పెరిగినట్లు తెలిపింది.


NTCA రిపోర్ట్ ప్రకారం.. 2019లో 96 పులులు చనిపోగా.. 2023కి ఈ సంఖ్య 178కి పెరిగింది. 2012 నుంచి చూస్తే.. 2023లోనే అత్యధికంగా పులుల మరణాలు సంభవించాయి. పులుల దాడిలో 2019, 2020లో 49 మంది, 2021లో 59 మంది, 2022లో 110 మంది, 2023లో 82 మంది మరణించారని కేంద్రపర్యావరణశాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు.

ప్రస్తుతం భారతదేశంలో 3,682 పులులు ఉండగా.. ఇది ప్రపంచ అడవి పులుల సంఖ్యలో 75 శాతం అని NTCA వెల్లడించింది. దేశంలో 1973లో పులుల సంరక్షణకోసం ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది ప్రభుత్వం. అప్పుడు 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్ లు ఉండగా.. 78,735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 55 టైగర్ రిజర్వ్ లను కలిగి ఉంది. మొత్తం భూభాగంలో 2.4 శాతం పులుల కోసమై కేటాయించారు.


 

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×