E-Paper
Advertisement

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ
Advertisement

NDA CM’s Conclave Meeting : హరియాణా రాజధాని చండీగఢ్’లో ఇవాళ ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉఫ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు.  మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

తొలి సమావేశం…

Advertisement

ఇక హరియాణా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పాటైన తొలి ఎన్డీఏ కూటమి సమావేశం ఇదే కావడం గమనార్హం.

17 సీఎంలు, 18 డీసీఎంలు…

Advertisement

మొత్తం 17 రాష్ట్రాల సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరైన ఈ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్ అభివృద్ధికి తమ కూటమి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా హాజరయ్యారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. అనంతరం వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Also Read :  దక్షిణాదిలో కాంగ్రెస్ జెండాను నిలబెట్టేది ఎవరు, వయనాడ్’పై హైకమాండ్ స్పెషల్ ఫోకస్

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×