E-Paper
Advertisement

Nitin Gadkari: స్టేజ్‌పై మాట్లాడుతూనే.. స్పృహ తప్పి పడిపోయిన కేంద్రమంత్రి.. (వీడియో)

Nitin Gadkari: స్టేజ్‌పై మాట్లాడుతూనే.. స్పృహ తప్పి పడిపోయిన కేంద్రమంత్రి.. (వీడియో)

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ గడ్కరీ స్పృహ కోల్పోయారు. యవత్మాల్‌ వాశిమ్ లోక్ సభ స్థానం నుంచి కూటమి తరపున సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన రాజశ్రీ పోటీ చేస్తున్నారు. అయితే ఆమె తరపున గడ్కరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

స్పృహ తప్పి పడిపోయిన నితిన్ గడ్కరీని అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గడ్కరీ విపరీతమైన ఎండ ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

నాగ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి గడ్కరీ పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి కూడా అక్కడి నుంచే గడ్కరీ ఎన్నికల బరిలో దిగారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×