Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ గడ్కరీ స్పృహ కోల్పోయారు. యవత్మాల్ వాశిమ్ లోక్ సభ స్థానం నుంచి కూటమి తరపున సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన రాజశ్రీ పోటీ చేస్తున్నారు. అయితే ఆమె తరపున గడ్కరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
స్పృహ తప్పి పడిపోయిన నితిన్ గడ్కరీని అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గడ్కరీ విపరీతమైన ఎండ ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
నాగ్పుర్ లోక్సభ నియోజకవర్గానికి గడ్కరీ పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి కూడా అక్కడి నుంచే గడ్కరీ ఎన్నికల బరిలో దిగారు.
Nagpur's Sitting MP & Loksabha Candidate #NitinGadkari fainted (बेहोश) during an election sabha in Yavatmal.
He was campaigning for Rajashree Patil, who is from Chief Minister Eknath Shinde's faction of the Shiv Sena.#GetWellSoonGadkari 🙏 pic.twitter.com/RSIcZFw9fj
— Shashank Gattewar | Nagpur (@SGattewar_NGP) April 24, 2024