Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న మాటలు కేవలం ఒక వీడ్కోలు ప్రసంగంలా కాకుండా.. గత రెండు దశాబ్దాల అభివృద్ధి ప్రస్థానానికి అద్ధం పట్టేలా ఉన్నాయి.
నవంబర్ 24,2005న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి బీహార్లో ఒక కొత్త అధ్యాయం మెుదలైందని ఆయన గుర్తుచేశారు. గడిచిన 20 ఏళ్లలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన నెలకొల్పడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్నీ వర్గాల కోసం, ముఖ్యంగా దళితులు, మహాదళితులు, మహిళలు, వెనుకబడిన వర్గాల కోసం తమ ప్రభువ్వం అంకితభావంతో పనిచేసిందని ఆయన పేర్కొన్నారు.
పాలనా పరంగా బీహార్ సాధించిన మార్పులను ఆయన వివరిస్తూ.. విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో జరిగిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావించారు. కేవలం గతాన్ని నెమరువేసుకోవడమే కాకుండా, భవిష్యత్తు కోసం 7నిశ్చయ్-3 ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విజన్ ద్యారా రాబోయే ఐదేళ్లలో బీహార్ దేశంలోని అగ్రగామి రాష్ట్రాల సరసన నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న మద్దతును ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ‘నేను ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. గవర్నర్ను కలిసి నా రాజీనామా సమర్పించాను’,అని చెబుతూనే .. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటాయాని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞితను చాటుకుంటూ, బీహార్ ప్రగతి పథంలో మరింత వేగంగా దూసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్నిముంగంచారు. ఇది ఒక నాయుకుడి నిష్క్రమణ మాత్రమే కాదు.. బీహార్ భవిష్యత్తు కోసం ఆయన వేసిన బలమైన పునాది నిదర్శనం.