E-Paper
Advertisement

Supreme Court : లంచం కేసులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme Court : లంచం కేసులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Advertisement

Supreme Court

Supreme Court: లంచ కేసులపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేల లాంటి ప్రజాప్రతినిధులకు మినహాయింపులేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు, మాట్లాడేందుకు , ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే అలాంటి ప్రజాప్రతినిధులకు ఆ కేసు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. పార్లమెంట్ , అసెంబ్లీల్లో సభ్యులు అవినీతి చేస్తే ఆ ప్రజాప్రతినిధులను విచారణ చేయడంపై  ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై 1998లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

Advertisement

2012లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా కేసు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. అప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓటు వేయడానికి లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని సీతా సోరెన్ ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2019లో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ నిర్వహించింది. చట్ట సభల్లో సభ్యులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసువచ్చా? చట్టసభ సభ్యులకు రక్షణ ఉంటుందా? ఈ అంశాలు ఎంతో ముఖ్యమైనవిగా పేర్కొంది. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.

Advertisement

Read More: మార్చి 12 తర్వాత విచారణకు హాజరవుతా.. ఈడీకి కేజ్రీవాల్ సమాధానం..

జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ కేసును ఇటీవల సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ విచారణ చేపట్టింది. చట్ట సభల్లో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని 1998లో పీవీ నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో ఇచ్చిన తీర్పు సమీక్షించాలని స్పష్టం చేసింది. దీని కోసం ఏడుగుర సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కేసును విచారణ చేసిన రాజ్యంగ ధర్మాసనం తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. అవినీతికి పాల్పడేవారికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని స్పష్టం చేసింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని తేల్చింది.

1993లో ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఈసమయంలో జేఎంఎం ఎంపీ శిబు సోరెన్ తోపాటు మరో నలుగురు ఆ పార్టీ ఎంపీలు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. వారు ఐదుగురు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. అందువల్లే పీపీ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో నెగ్గిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఐదుగురు జేఎంఎం ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే జేఎంఎం ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీలకు లంచం కేసుల విచారణను మినహాయింపు ఇస్తూ 1998లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×