E-Paper
Advertisement

Arvind Kejriwal : మార్చి 12 తర్వాత విచారణకు హాజరవుతా.. ఈడీకి కేజ్రీవాల్ సమాధానం..

Arvind Kejriwal : మార్చి 12 తర్వాత విచారణకు హాజరవుతా.. ఈడీకి కేజ్రీవాల్ సమాధానం..
Advertisement

 

Arvind Kejriwal

Advertisement

Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టికేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఈరోజు మాత్రం ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఇటీవల ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రికి విచారణకు రావాలని 8వ సారి నోటీసులు ఇచ్చారు. మార్చి 4న విచారణకు రావాలని కోరారు.

ఈసారి కూడా కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరుకాలేదు. కానీ ఈడీ అధికారులకు మాత్రం నోటీసులకు సమాధానం పంపించారు. ఈడీ తనకు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. కానీ ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

Advertisement

విచారణకు నేరుగా హాజరుకాలేని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి తెలియజేశారు. మార్చి 12 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని షరతు పెట్టారు.

Read More: జన్ విశ్వాస్ మహా ర్యాలీ.. ఎన్నికల సమరశంఖాన్ని పూరించిన ఇండియా కూటమి నేతలు..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ 2023 నవంబర్ 2న తొలిసారిగా నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. ఆ తర్వాత వరుసగా సమన్లు జారీ చేసింది. ఇలా మొత్తం 8 సార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపింది. కానీ తొలి ఏడు నోటీసులకు హాజరుకావడానికి విముఖత చూపించారు. ఈడీ సమన్లకు సమాధానం కూడా ఇవ్వలేదు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంతో  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఈ పిటిషన్ పై కోర్టు నోటీసులు ఇవ్వడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫెరన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన విజ్ఞప్తితో తుదిపరి విచారణ మార్చి 16కి వాయిదా పడింది. ఆ రోజు ఢిల్లీ సీఎం స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు.

 

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×