E-Paper
Advertisement

Diwali Bonus : ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్..

Diwali Bonus : ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్..
Advertisement

Diwali Bonus : తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరి పట్టణంలో ఉన్న ఒక టీ ఎస్టేట్ యజమాని పి శివకుమార్ తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రూ.2 లక్షలకు పైగా విలువైన బైక్‌లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టీ ఎస్టేట్‌లో గత రెండు దశాబ్దాలుగా 627 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. శివకుమార్.. తన మేనేజర్, సూపర్‌వైజర్, స్టోర్ కీపర్, క్యాషియర్, ఫీల్డ్ స్టాఫ్, డ్రైవర్‌లతో సహా 15 మంది ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు.

కొత్త బైక్‌ల తాళాలు ఉద్యోగులకు అందజేసి వారితో కలిసి శివకుమార్ రైడ్‌కి కూడా వెళ్లాడు. ఎస్టేట్‌ యజమాని తమకు 15 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను బహుమతిగా ఇచ్చాడని ఓ ఉద్యోగి తెలిపాడు. తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించాలని కోరుకునే కార్మికుల కోసం ఎస్టేట్ సమీపంలోని నేడుగుల పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను ఎస్టేట్ యాజమాన్యం నియమించింది. గతంలో మూతపడే దశలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 320 మంది విద్యార్థులు ఉండగా, అందులో 80 మంది ఎస్టేట్‌కు చెందిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా, శివకుమార్ కార్మికులకు ఉచితంగా మందులు అందజేసే ఫార్మసీని కూడా నడుపుతున్నాడు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×