E-Paper
Advertisement

Rahul Gandhi: వ్వవస్థలను బీజేపీ కబ్జా చేయడం వల్లే పేపర్ లీకేజీలు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: వ్వవస్థలను బీజేపీ కబ్జా చేయడం వల్లే పేపర్ లీకేజీలు: రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi Over NEET UG 2024 Row: దేశంలో కొనసాగుతున్న నీట్, యూజీసీ-నెట్ వివాదంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్ని వ్వవస్థలను భారతీయ జనతా పార్టీ స్వాధీనం చేసుకున్నందున అన్ని పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌పై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో, పరీక్షల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ UGC-NETని రద్దు చేయాలని ఆదేశించిందన్నారు. ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించిందన్నారు రాహుల్ గాంధీ.

Advertisement

బీజేపీ ప్రతి పదవికి తమ వ్యక్తులను పెడుతుందని, అందుకే ఈ లీకులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ఒక సంస్థ కబ్జా చేసిందని ప్రతి పోస్ట్‌లో వారి వ్యక్తులను ఉంచారన్నారు ఆయన. దానిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో విద్యాసంస్థలను స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు భారతదేశంలో స్వతంత్ర విద్యా వ్వవస్థ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్థం చేశారు.

వైస్ ఛాన్స్‌లర్లను మెరిట్ ఆధారంగా నియమించాలని కానీ ప్రభుత్వం తమ వారని ఆ పదవుల్లో కూర్చోబెడుతోందని అన్నారు. బీజేపీ విద్యావ్వవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. బీజేపీ విద్యావ్వస్థలోకి చొచ్చుకుపోయిందని అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ ఆర్థిక వ్వవస్థను ఎలా కుప్పకూల్చారో ఇప్పుడు విద్యావ్వవస్థను అలానే చేస్తున్నారని ఆవేదన వ్వక్తం చేశారు.

Advertisement

Also Read: అవును.. NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు

ప్రశ్న పత్రలా లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన పెడుతున్నారని.. ఇది ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. లీకేజీపై విద్యార్థులు రోడ్లెక్కారని.. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలన్నారు రాహుల్ గాంధీ.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×