BigTV English

Parliament : పార్లమెంటులో ఉగ్రదాడికి 21 ఏళ్లు..

Parliament : పార్లమెంటులో ఉగ్రదాడికి 21 ఏళ్లు..

Parliament : భారత పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడికి 21 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు పలువురు ప్రముఖులు. పార్లమెంట్ ఆవరణలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జునఖర్గే, సోనియాగాంధీ నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. వారు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని అన్నారు. ఆ ఘటనలో మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


లష్కరే తొయిబా ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్​పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్​లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. ఇందులో ఓ పౌరుడు, భద్రతా సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పార్లమెంట్​లో 100 మంది సభ్యులు ఉన్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×