E-Paper
Advertisement

PM Modi Election Affidavit: ప్రధాని మోదీ ఎన్నికల అఫిడవిట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

PM Modi Election Affidavit: ప్రధాని మోదీ ఎన్నికల అఫిడవిట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement

PM Modi Election Affidavit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లోక్‌సభ ఎన్నికలకు వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాని మోదీ అఫిడవిట్ ప్రకారం, ఆయనకు రూ. 3.02 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. రూ. 52,920 నగదు కలిగి ఉన్నారు. ప్రధాని మోదీకి సొంతిళ్లు, కారు లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన పేరు మీద ఎలాంటి భూమి కూడా లేదని మోదీ అఫిడవిట్‌లో తెలిపారు.

ప్రధాని మోదీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11 లక్షల నుంచి 2022-23 నాటికి రూ. 23.5 లక్షలకు రెట్టింపు అయిందని అఫిడవిట్ చూపుతోంది. ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు ఖాతాలు ఉన్నాయి. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మోదీ రూ.73,304 డిపాజిట్ చేయగా, ఎస్‌బీఐ వారణాసి బ్రాంచ్‌లో రూ.7వేలు మాత్రమే ఉన్నాయి.

Advertisement

ప్రధానమంత్రి ఎస్‌బీఐలో రూ.2,85,60,338 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా కలిగి ఉన్నారు. ప్రధానమంత్రి వద్ద రూ.2,67,750 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయి. 2014లో తొలిసారిగా వారణాసి నుంచి ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మోదీ విజయం సాధించి తొలిసారి ప్రధాని అయ్యారు. 2019లో ఈ స్థానం నుంచి పోటీ చేసి రెండో సారి ప్రధాని అయ్యారు. ముచ్చటగా మూడోసారి మోదీ వారణాసి బరిలో ఉన్నారు. జూన్ 1న చివరి దశలో వారణాసికి ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: వారణాసిలో మోదీ నామినేషన్, మెజార్టీపైనే ఫోకస్

Advertisement

మంగళవారం, ప్రధాని మోదీ తన నామినేషన్ దాఖలు చేయడానికి వారణాసి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లినప్పుడు, ఆయనతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా తదితరులు ప్రధాని వెంట కనిపించారు. ప్రధాని మోదీతో పాటు తన నలుగురు ప్రతిపాదకులు- పండిట్ గణేశ్వర్ శాస్త్రి, లాల్‌చంద్ కుష్వాహా, బైజ్‌నాథ్ పటేల్, సంజయ్ సోంకర్ కూడా ఉన్నారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×