BigTV English

PM Modi Gujarat Tour Highlights: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

PM Modi Gujarat Tour Highlights: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

PM Modi inaugurates India's longest cable-stayed Sudarshan Setu bridge in Dwarka


PM Modi Gujarat Tour Highlights : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు. ఈ వంతెన నిర్మాణానికి 979 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

Read More: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు పడేది ఆ రోజే..


దేశంలోనే అతిపొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ కు సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు. ఈ వంతెన నిర్మాణంతో ఓఖా ప్రాంతం.. బెట్ ద్వారకా తో అనుసంధానమైంది. 2017 అక్టోబర్ లో ప్రధాని మోదీ సుదర్శన్ సేతు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

4 వరుసలతో ఈ వంతెనను నిర్మించారు. బ్రిడ్జ్ వెడల్పు 27.20 మీటర్లు. ఇందులోనే ఫుట్‌పాత్‌ ను ఏర్పాటు చేశారు. పుట్ పాత్ వెడల్పు 2.5 మీటర్లు. వంతెనకు ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పొందుపర్చారు. బ్రిడ్జిపై సోలార్‌ ప్యానళ్లు అమర్చారు. దీని ద్వారా మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.

ప్రధాని గుజరాత్ పర్యటనలో ద్వారక ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా 5 ఎయిమ్స్ హాస్పిటళ్లను ప్రారంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ కూడా ఉంది.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×