E-Paper
Advertisement

Namo Bharat : నమోభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని.. ఫీచర్లు ఇవే..

Namo Bharat : నమోభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని.. ఫీచర్లు ఇవే..
Advertisement

Namo Bharat : భారత్ లో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ ను ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లోని సాహిబాబాద్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ- గజియాబాద్- మీరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ను కూడా మోదీ శుక్రవారం ప్రారంభించారు. భారత్ లోనే తొలి ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్(RRTS) ఇదే కావడం విశేషం. ప్రధానితో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పురి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. RRTS ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఆ రైలులో ప్రయాణించి.. స్కూల్ స్టూడెంట్స్, ర్యాపిడ్ ఎక్స్ రైలు సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించారు.

‘నమో భారత్’ ఒక పరివర్తన ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమమని, ఇది ఇంటర్‌సిటీ కమ్యూటింగ్ కోసం హై-స్పీడ్ రైళ్లను అందించడానికి రూపొందించబడిందని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. కాగా.. నిన్నటి వరకూ RapidX గా ఉన్న ఈ రైలు.. నమో భారత్ గా మార్చబడింది. శనివారం (అక్టోబర్21) నుంచి ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ ల ప్రయాణికులకు నమోభారత్ రైలు అంుబాటులో ఉంటుంది. సాహిబాబాద్ నుంచి మొత్తం 4 స్టేషన్లలో నమోభారత్ రైలు ఆగుతుంది. ఘజియాబాద్, గుల్ధర్, దుహై, దుహై డిపోలలో రైలు ఆగుతుంది.

Advertisement

గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లే..నమోభారత్ లో.. వందేభారత్ ను మించిన ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 17 కిలోమీటర్ల మేర నమోభారత్ పరుగులు పెట్టనుంది. ఓవర్ హెడ్ స్టోరేజ్, వైఫై, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్లు ఉన్నాయి. విశాలవంతమైన సీటింగ్, విశాలమైన లెగ్ రూమ్, కోట్ హ్యాంగర్లతో కూడిన ప్రీమియం క్లాస్ లు కూడా ఉన్నాయి. రైలు భద్రతా ఫీచర్ల విషయానికొస్తే.. ప్రతికోచ్ లో సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్, ఆపరేటర్ తో కమ్యూనికేట్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక బటన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో అన్నీ ఏసీ పెట్టెలే ఉంటాయి. నిలబడేందుకు కూడా విశాలమైన ప్రదేశాన్ని ఉంచారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ.. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున నమోభారత్ రైళ్లు సేవలందించనున్నాయి.

ప్రతి రైలులో ఆరు కోచ్ లు.. ప్రీమియంలో 62 సీట్లు, సాధారణ కోచ్ లో 72 సీట్లు ఉంటాయి. ఒక ట్రిప్ లో మొత్తం 1700 మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించవచ్చు. అలాగే మహిళల కోసం ఒక కోచ్ ను, దివ్యాంగులు, వృద్ధులకు ప్రతికోచ్ లోనూ ప్రత్యేక సీట్లను కేటాయించారు. సాధారణ కోచ్ టికెట్ ధర రూ.20-50, ప్రీమియం కోచ్ టికెట్ ధర రూ.40-100 మధ్య ఉంటుంది.

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×