E-Paper
Advertisement

PM Modi: బిజీ బిజీగా ప్రధాని మోదీ..100 రోజుల అజెండాపై ఫోకస్

PM Modi: బిజీ బిజీగా ప్రధాని మోదీ..100 రోజుల అజెండాపై ఫోకస్
Advertisement

PM Modi: లోక్ సభ ఎన్నికలు, కన్యాకుమారి పర్యటన తర్వాత ప్రధాని మోదీ తిరిగి అధికారిక సమావేశాలతో ఆదివారం బిజీ బిజీగా గడపనున్నారు. మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు సహా.. దేశంలోని హీట్ వేవ్ పరిస్థితులపై మోదీ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జూన్ 1న ముగిసింది. అయితే పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం పలు న్యూస్ చానళ్లు, వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. వాటిలో దాదాపు అన్ని సర్వేలు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఆదివారం మోదీ చేపట్టనున్న సమావేశాల్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేయాల్సిన పనులపై నేతలతో చర్చలు జరపనున్నారు.

Advertisement

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాగా.. ఈ నేపథ్యంలో జరిగే వార్షిక ఈవెంట్ సెలబ్రేషన్స్ గురించిన పలు నిర్ణయాలను మోదీ తీసుకోనున్నట్లు సమాచారం.భూమి పునరుద్ధరణ, డిసెర్టిఫికేషన్, కరువు థీమ్ తో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరగనుంది. ఈవెంట్ కు సంబంధించిన పలు ఏర్పాట్లపై మోదీ చర్చించనున్నట్లు సమాచారం.

Also Read:  ఎగ్జిట్ పోల్స్‌పై రాహుల్ కామెంట్స్, అది మోదీ మీడియా పోల్..

Advertisement

ఈ విధంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు సీనియర్ నేతలతో మోదీ చర్చించారు. మోదీ 3.0కు సిద్ధంగా ఉండాలని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందుకు తగ్గట్టుగా సన్నద్దంగా ఉండాలని సూచించారు. ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×