BigTV English

PM Modi: బిజీ బిజీగా ప్రధాని మోదీ..100 రోజుల అజెండాపై ఫోకస్

PM Modi: బిజీ బిజీగా ప్రధాని మోదీ..100 రోజుల అజెండాపై ఫోకస్

PM Modi: లోక్ సభ ఎన్నికలు, కన్యాకుమారి పర్యటన తర్వాత ప్రధాని మోదీ తిరిగి అధికారిక సమావేశాలతో ఆదివారం బిజీ బిజీగా గడపనున్నారు. మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు సహా.. దేశంలోని హీట్ వేవ్ పరిస్థితులపై మోదీ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.


లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జూన్ 1న ముగిసింది. అయితే పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం పలు న్యూస్ చానళ్లు, వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. వాటిలో దాదాపు అన్ని సర్వేలు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఆదివారం మోదీ చేపట్టనున్న సమావేశాల్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేయాల్సిన పనులపై నేతలతో చర్చలు జరపనున్నారు.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాగా.. ఈ నేపథ్యంలో జరిగే వార్షిక ఈవెంట్ సెలబ్రేషన్స్ గురించిన పలు నిర్ణయాలను మోదీ తీసుకోనున్నట్లు సమాచారం.భూమి పునరుద్ధరణ, డిసెర్టిఫికేషన్, కరువు థీమ్ తో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరగనుంది. ఈవెంట్ కు సంబంధించిన పలు ఏర్పాట్లపై మోదీ చర్చించనున్నట్లు సమాచారం.


Also Read:  ఎగ్జిట్ పోల్స్‌పై రాహుల్ కామెంట్స్, అది మోదీ మీడియా పోల్..

ఈ విధంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు సీనియర్ నేతలతో మోదీ చర్చించారు. మోదీ 3.0కు సిద్ధంగా ఉండాలని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందుకు తగ్గట్టుగా సన్నద్దంగా ఉండాలని సూచించారు. ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Big Stories

×