E-Paper
Advertisement

PM Modi Telangana Tour : మోదీ తెలంగాణ టూర్ .. షెడ్యూల్ ఖరారు..

PM Modi Telangana Tour : మోదీ తెలంగాణ టూర్ .. షెడ్యూల్ ఖరారు..

 

PM Modi Telangana Tour

 

PM Modi Telangana Tour Schedule: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ.. తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఆయన టూర్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి మొదటివారంలో తెలంగాణలో మోదీ పర్యటించనున్నారు. మార్చి 4, 5 తేదీల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో మార్చి 4న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఆదిలాబాద్ పర్యటన తర్వాత మోదీ హైదరాబాద్ కు వస్తారు. ఆ రోజు రాజభవన్ లో ఉంటారు. మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. అక్కడ అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.

Read More: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ఇద్దరు ఎంపీలు..

మరోవైపు మార్చి 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన వాయిదా పడింది. సరిగ్గా అదే రోజు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు.

 

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×