E-Paper
Advertisement

Prashanth Kishore: బిహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నేను చేసిన తప్పు: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Prashanth Kishore: బిహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నేను చేసిన తప్పు: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Prashanth Kishore: ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థాపించిన ‘జన్ సురాజ్ పార్టీ’ ఘోర పరాజయం పాలవడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) తొలిసారిగా స్పందించారు. ఈ ఎన్నికల్లో పార్టీకి కనీసం 4 శాతం ఓట్లు కూడా రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే పెద్ద పొరపాటని ఆయన అంగీకరించారు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, “నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం ఒక తప్పుగా భావించవచ్చు. మా పార్టీకి 4 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే ఇంకా ఎంతో కష్టపడాల్సి ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్‌లోని మొత్తం 243 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం, డిపాజిట్లు కోల్పోవడం తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు.

అయితే, ఈ ఓటమితో తాను వెనకడుగు వేయబోనని పీకే స్పష్టం చేశారు. “బిహార్‌ను గెలవకుండా నేను వెనక్కి తగ్గేదే లేదు. ఇందుకు ఎంత సమయం పట్టినా సరే, నా పోరాటం ఆపను” అని ధీమా వ్యక్తం చేశారు. తన అంచనాలు తప్పాయని, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యామని నిజాయితీగా ఒప్పుకున్నారు. భవిష్యత్తులో మరింత పగడ్బందీగా వ్యూహాలు రచిస్తామని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, నవంబర్ 2025లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించగా, జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ‘జన్ సురాజ్ పార్టీ’ బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.

Read Also: Sleep Hours: రోజూ 5 గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీరు సూపర్ హీరోలే, ఎందుకంటే?

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×