E-Paper
Advertisement

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
Advertisement

Rahul Gandhi: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ధరలు, ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటోందని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల వల్లే సామాన్యుడిపై ఈ స్థాయి భారం పడుతోందని ఆయన మండిపడ్డారు.

కొరతతో ప్రజల కష్టాలు.. రాజ్యాంగ ఉల్లంఘన

Advertisement

రాబోయే రోజుల్లో దేశంలో ఎరువులు, చమురు, గ్యాస్ కొరత తీవ్రం కానుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ నిత్యావసరాల కొరత కారణంగా ప్రజలు అల్లాడిపోయే పరిస్థితులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని, ప్రజాస్వామ్య విలువులను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు.

కొద్దిమంది చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ

Advertisement

దేశ ఆర్థిక రంగాన్ని ప్రధాని మోదీ కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీలతో పాటు అమెరికా చేతుల్లో పెట్టారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దేశ సంపదనంతా లూటీ చేసి, కొద్దిమంది పెద్దల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీపై విమర్శలు

భారత్ మున్ముందు ఎదుర్కోబోయే ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలనూ, సామాన్యుల జీవితాలనూ పూర్తిగా నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ సంక్షోభం ముదిరి దేశం మొత్తం ఇబ్బందుల్లో పడినప్పుడు.. ప్రధాని మోదీ ప్రజల ముందుకు వచ్చి నటన ప్రదర్శిస్తారని ఎద్దేవా చేశారు. ‘ఇదంతా జరిగినప్పుడు మోదీ గారు ప్రజల ముందుకు వచ్చి, ఇందులో తన తప్పేమీ లేదంటూ ఏడుస్తారు’ అని రాహుల్ గాంధీ వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తప్పుడు విధానాలను పక్కనబెట్టాలని డిమాండ్ చేశారు.

మోదీ ‘మెలోడీ’ చాక్లెట్ల‌పై రాహుల్ సెటైర్లు

ప్రధాని మోదీ ఇటలీ పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, విదేశాలకు వెళ్లవద్దని ప్రజలకు చెప్పిన మోదీ.. తానే స్వయంగా ఖరీదైన విమానంలో ఇటలీ వెళ్లారని విమర్శించారు. ఇటలీ ప్రధాని మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్ ఇచ్చి రీల్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: కాంగ్రెస్ కార్యకర్తలకు బంపర్ భరోసా.. కష్టపడితే గుర్తింపు గ్యారెంటీ.. ఎంపీ చామల

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×