Rahul Gandhi: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ధరలు, ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటోందని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల వల్లే సామాన్యుడిపై ఈ స్థాయి భారం పడుతోందని ఆయన మండిపడ్డారు.
కొరతతో ప్రజల కష్టాలు.. రాజ్యాంగ ఉల్లంఘన
రాబోయే రోజుల్లో దేశంలో ఎరువులు, చమురు, గ్యాస్ కొరత తీవ్రం కానుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ నిత్యావసరాల కొరత కారణంగా ప్రజలు అల్లాడిపోయే పరిస్థితులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని, ప్రజాస్వామ్య విలువులను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు.
కొద్దిమంది చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ
దేశ ఆర్థిక రంగాన్ని ప్రధాని మోదీ కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీలతో పాటు అమెరికా చేతుల్లో పెట్టారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దేశ సంపదనంతా లూటీ చేసి, కొద్దిమంది పెద్దల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీపై విమర్శలు
భారత్ మున్ముందు ఎదుర్కోబోయే ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలనూ, సామాన్యుల జీవితాలనూ పూర్తిగా నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ సంక్షోభం ముదిరి దేశం మొత్తం ఇబ్బందుల్లో పడినప్పుడు.. ప్రధాని మోదీ ప్రజల ముందుకు వచ్చి నటన ప్రదర్శిస్తారని ఎద్దేవా చేశారు. ‘ఇదంతా జరిగినప్పుడు మోదీ గారు ప్రజల ముందుకు వచ్చి, ఇందులో తన తప్పేమీ లేదంటూ ఏడుస్తారు’ అని రాహుల్ గాంధీ వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తప్పుడు విధానాలను పక్కనబెట్టాలని డిమాండ్ చేశారు.
మోదీ ‘మెలోడీ’ చాక్లెట్లపై రాహుల్ సెటైర్లు
ప్రధాని మోదీ ఇటలీ పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, విదేశాలకు వెళ్లవద్దని ప్రజలకు చెప్పిన మోదీ.. తానే స్వయంగా ఖరీదైన విమానంలో ఇటలీ వెళ్లారని విమర్శించారు. ఇటలీ ప్రధాని మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్ ఇచ్చి రీల్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: కాంగ్రెస్ కార్యకర్తలకు బంపర్ భరోసా.. కష్టపడితే గుర్తింపు గ్యారెంటీ.. ఎంపీ చామల
మోదీ 'మెలోడీ' చాక్లెట్లపై రాహుల్ సెటైర్లు
ప్రధాని మోదీ ఇటలీ పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, విదేశాలకు వెళ్లవద్దని ప్రజలకు చెప్పిన మోదీ.. తానే స్వయంగా ఖరీదైన విమానంలో ఇటలీ వెళ్లారని విమర్శించారు. ఇటలీ ప్రధాని… https://t.co/EKyrXx3Kij pic.twitter.com/syG8i0LKVj
— BIG TV Breaking News (@bigtvtelugu) May 20, 2026
దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశ ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీ, అమెరికాలో చేతుల్లో పెట్టారంటూ.. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాబోయే ఆర్థిక సంక్షోభం అన్నింటినీ నాశనం చేస్తుందని.. ఇదంతా జరిగినప్పుడు మోడీ ప్రజల ముందుకు వచ్చి… pic.twitter.com/JsIQMfr4EH
— BIG TV Breaking News (@bigtvtelugu) May 20, 2026
ద్రవ్యోల్బణంపై రాహుల్ గాంధీ ఆందోళన
దేశంలో ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనిస్థాయికి చేరుతుందని కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎరువులు, చమురు, గ్యాస్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, ప్రధాని మోదీ సర్కార్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని… pic.twitter.com/RHSGDGW3qH
— BIG TV Breaking News (@bigtvtelugu) May 20, 2026