E-Paper
Advertisement

Rahul Gandhi: మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

Rahul Gandhi: మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
Advertisement

Rahul Gandhi: ప్రస్తుతం భారతదేశంలో శాంతియుత నిరసన తెలపడం అతిపెద్ద నేరంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారత్.. నేడు భిన్నాభిప్రాయాలను రాజద్రోహంగా భావించే దిశగా వెళ్తోందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంపై ప్రశ్నలు అడిగితే లాఠీఛార్జ్.. ప్రాసిక్యూషన్.. జైలు శిక్షలు ఖాయమనే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దుయ్యబట్టారు.

వివిధ వర్గాల ఆందోళనలను ప్రభుత్వం అణచివేస్తున్న తీరును రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఎండగట్టారు. పేపర్ లీక్‌తో భవిష్యత్తు అంధకారమైన యువత తమ హక్కుల కోసం పోరాడితే లాఠీలతో సమాధానం చెబుతున్నారని విమర్శించారు. దేశానికి గర్వకారణమైన మహిళా రెజ్లర్లు బీజేపీ నేతపై ఆరోపణలు చేసి నిష్పాక్షిక దర్యాప్తు కోరితే వారిని అప్రతిష్టపాలు చేసి వీధుల నుండి బలవంతంగా తొలగించారని గుర్తు చేశారు. అత్యాచార బాధితులకు న్యాయం కోరితే ఆ డిమాండ్‌ను వ్యవస్థకు అసౌకర్యంగా భావిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు “జాతి వ్యతిరేకులు”గా ముద్ర వేశారని ఆరోపించారు.

Advertisement

రైతులు.. గిరిజనుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును రాహుల్ తీవ్రంగా ఖండించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై టియర్ గ్యాస్.. రబ్బరు బుల్లెట్లు.. వాటర్ ఫిరంగులను ప్రయోగిస్తూ వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. నీరు.. అడవి.. భూమి కోసం నిలబడిన గిరిజనులను కూడా అనుమానంతో చూడటం నేరమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలపై నిలదీసే సామాన్యుల ఆందోళనలను కూడా రాజకీయాలుగా అణచివేస్తున్నారని విమర్శించారు.

“మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు” అంటూ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతియుత నిరసన అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ అని.. ప్రశ్నలు అడగడం బలహీనత కాదు అది ప్రజాస్వామ్య బలం అని స్పష్టం చేశారు. విమర్శలను విని ప్రభుత్వం జవాబుదారీగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని హితవు పలికారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశానికే శత్రువులుగా పరిగణించే ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని ఆయన హెచ్చరించారు.

Advertisement

Read Also: PCC Internal Report: కాంగ్రెస్‌లో కలిసిరాని యువ ఎమ్మెల్యేల నాయకత్వం.. తలకిందులైన పీసీసీ టార్గెట్ ఫలితాలు..?

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో కీలక మలుపు!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×