E-Paper
Advertisement

Railway Charges: రైల్వే ఛార్జీల పెంపు నేటి నుంచే.. ఈ టికెట్లకు మినహాయింపు

Railway Charges: రైల్వే ఛార్జీల పెంపు నేటి నుంచే.. ఈ టికెట్లకు మినహాయింపు
Advertisement

Railway Charges: భారతీయ రైల్వే.. ఇటీవల టికెట్ల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. పెంచిన టికెట్ ధరలు ఇవాళ్టి నుండి అమల్లోకి వచ్చింది. ఆరు నెలల్లో రెండోసారి రైల్వేశాఖ ఛార్జీలు పెంచింది. ఇప్పటికే తమ రైలు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు డిసెంబర్ 26న లేదా ఆ తర్వాత ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు, విమాన ప్రయాణాలతో పోలిస్తే రైలు ప్రయాణం అత్యంత తక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

పెరిగిన ఛార్జీలు ఇలా

కొత్త రైలు ఛార్జీల ప్రకారం, నాన్-ఏసీ కోచ్‌లలో 500 కి.మీ వరకు ప్రయాణించే ప్రయాణికులు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. నాన్-ఏసీ కోచ్‌లలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కి.మీ.కు 2 పైసలు పెంచగా, ఏసీ క్లాస్ ఛార్జీలు కూడా కి.మీ.కు 2 పైసలు పెంచింది. 215 కి.మీ వరకు సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్లు, సెకండ్ క్లాస్ ఆర్డినరీ ప్రయాణాలకు ఛార్జీల పెంచలేదు. నాన్-సబర్బన్ మార్గాలతో సహా సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 215 కి.మీ వరకు ప్రయాణాలకు ఛార్జీల పెంపు లేదు.

ప్రధాన సర్వీసుల ఛార్జీలు పెంపు

Advertisement

తేజస్ రాజధాని, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హమ్‌సఫర్, అమృత్ భారత్, తేజస్, మహామన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, యువ ఎక్స్‌ప్రెస్, జన శతాబ్ది, నమో భారత్ రాపిడ్ రైల్, ఆర్డినరీ నాన్-సబర్బన్ సర్వీసులు (AC MEMU/DEMU మినహా) ప్రధాన రైలు సర్వీసులు ప్రాథమిక ఛార్జీలను సవరించారు. రిజర్వేషన్ ఫీజులు లేదా సూపర్‌ఫాస్ట్ ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ తెలిపింది.

Also Read: Lucknow Flower Pots: పీఎం ప్రోగ్రామ్ అవ్వగానే.. క్షణాల్లో పూల కుండీలు మాయం.. వీడియో వైరల్

పాత టికెట్లకు వర్తించదు

Advertisement

పెంచిన రేట్లు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు వర్తించవని రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, డిసెంబర్ 26, 2025న లేదా ఆ తర్వాత ప్రయాణాలకు ఎటువంటి ఛార్జీలు తేడా ఉండదని పేర్కొంది. అయితే పెంచిన ఛార్జీలను టీటీఈ జారీ చేసిన టికెట్లకు వర్తిస్తుందని తెలిపింది. ఇవాళ్టి నుంచి రైళ్లలో లేదా స్టేషన్లలో టీటీఈలు లేదా టికెట్ తనిఖీ సిబ్బంది జారీ చేసిన కొత్త టికెట్లకు పెంచిన ధరలు వసూలు చేస్తామని రైల్వేలు స్పష్టం చేశాయి. పెంచిన ఛార్జీల జాబితాలను అన్ని రైల్వే స్టేషన్లలో ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×