E-Paper
Advertisement

Railway Charges: రైల్వే ఛార్జీల పెంపు నేటి నుంచే.. ఈ టికెట్లకు మినహాయింపు

Railway Charges: రైల్వే ఛార్జీల పెంపు నేటి నుంచే.. ఈ టికెట్లకు మినహాయింపు

Railway Charges: భారతీయ రైల్వే.. ఇటీవల టికెట్ల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. పెంచిన టికెట్ ధరలు ఇవాళ్టి నుండి అమల్లోకి వచ్చింది. ఆరు నెలల్లో రెండోసారి రైల్వేశాఖ ఛార్జీలు పెంచింది. ఇప్పటికే తమ రైలు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు డిసెంబర్ 26న లేదా ఆ తర్వాత ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు, విమాన ప్రయాణాలతో పోలిస్తే రైలు ప్రయాణం అత్యంత తక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

పెరిగిన ఛార్జీలు ఇలా

కొత్త రైలు ఛార్జీల ప్రకారం, నాన్-ఏసీ కోచ్‌లలో 500 కి.మీ వరకు ప్రయాణించే ప్రయాణికులు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. నాన్-ఏసీ కోచ్‌లలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కి.మీ.కు 2 పైసలు పెంచగా, ఏసీ క్లాస్ ఛార్జీలు కూడా కి.మీ.కు 2 పైసలు పెంచింది. 215 కి.మీ వరకు సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్లు, సెకండ్ క్లాస్ ఆర్డినరీ ప్రయాణాలకు ఛార్జీల పెంచలేదు. నాన్-సబర్బన్ మార్గాలతో సహా సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 215 కి.మీ వరకు ప్రయాణాలకు ఛార్జీల పెంపు లేదు.

ప్రధాన సర్వీసుల ఛార్జీలు పెంపు

తేజస్ రాజధాని, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హమ్‌సఫర్, అమృత్ భారత్, తేజస్, మహామన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, యువ ఎక్స్‌ప్రెస్, జన శతాబ్ది, నమో భారత్ రాపిడ్ రైల్, ఆర్డినరీ నాన్-సబర్బన్ సర్వీసులు (AC MEMU/DEMU మినహా) ప్రధాన రైలు సర్వీసులు ప్రాథమిక ఛార్జీలను సవరించారు. రిజర్వేషన్ ఫీజులు లేదా సూపర్‌ఫాస్ట్ ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ తెలిపింది.

Also Read: Lucknow Flower Pots: పీఎం ప్రోగ్రామ్ అవ్వగానే.. క్షణాల్లో పూల కుండీలు మాయం.. వీడియో వైరల్

పాత టికెట్లకు వర్తించదు

పెంచిన రేట్లు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు వర్తించవని రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, డిసెంబర్ 26, 2025న లేదా ఆ తర్వాత ప్రయాణాలకు ఎటువంటి ఛార్జీలు తేడా ఉండదని పేర్కొంది. అయితే పెంచిన ఛార్జీలను టీటీఈ జారీ చేసిన టికెట్లకు వర్తిస్తుందని తెలిపింది. ఇవాళ్టి నుంచి రైళ్లలో లేదా స్టేషన్లలో టీటీఈలు లేదా టికెట్ తనిఖీ సిబ్బంది జారీ చేసిన కొత్త టికెట్లకు పెంచిన ధరలు వసూలు చేస్తామని రైల్వేలు స్పష్టం చేశాయి. పెంచిన ఛార్జీల జాబితాలను అన్ని రైల్వే స్టేషన్లలో ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×