E-Paper
Advertisement

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?
Advertisement

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో మహాక్రతువు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. శ్రీరాముడి విగ్రహానికి 155 దేశాల్లోని నదుల నుంచి సేకరించిన జలాలతో అభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 23న శ్రీరాముడికి జలాభిషేకం నిర్వహించనున్నారు. మణిరామ్‌ దాస్‌ చావ్నీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొంటారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఢిల్లీకి చెందిన రామభక్తుడు విజయ్‌ జొలీ నేతృత్వంలోని బృందం 155 దేశాల నుంచి తీసుకువచ్చిన జలాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేస్తారు. పాకిస్థాన్‌లోని రావి నది నుంచి కూడా జలాలు సేకరించారు. ఈ జలాలను పాక్‌లోని హిందువులు దుబాయ్‌కు పంపారు. అక్కడ నుంచి ఢిల్లీకి జలాలు చేరుకున్నాయని చంపత్ రాయ్‌ వివరించారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×