E-Paper
Advertisement

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే
Advertisement

Ration Card New Rules 2026: రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక. రేషన్ కార్డులో అనర్హుల ఏరివేత కార్యక్రమం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. కేంద్రప్రభుత్వం అమలు చేయనున్న నిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అనర్హులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్

Advertisement

దేశంలో పేద-మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంలో రేషన్ కార్డు కీలక పాత్ర. ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా తక్కువ ధరలకు బియ్యం, గోధుమలు, చక్కెర, ఆయిల్ వంటివి సరుకులు అందుతున్నాయి. ఈ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుండి కొత్త నిబంధనలను అమలు చేయనుంది.

రేషన్ కార్డులో ఉన్నవ్యక్తి తప్పనిసరిగా e-KYC చేయించుకోవాలి. సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి బయో మెట్రిక్ వేసుకోవచ్చు. మేరా రేషన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి మీ KYCని పూర్తి చేయాలి. ఈ- కేవైసీ పూర్తి చేయకపోతే ఏప్రిల్ ఒకటి నుండి మీకు రావాల్సిన రేషన్ నిలిచిపోయే అవకాశముంది.

Advertisement

ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దు

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు దారులకు వార్షిక ఆదాయ పరిమితిని పెంచింది ప్రభుత్వం. 18 ఏళ్లు పైబడిన మహిళను కుటుంబ పెద్దగా లెక్కలోకి తీసుకుంటారు. రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రాలు ఉండాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఫుడ్ సప్లై ఆఫీసర్ ఇంటికి వచ్చి ధృవీకరణ చేసిన తర్వాత కార్డు జారీ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల కోటాను పొందవచ్చు. దీనివల్ల ప్రతి నెలా రేషన్ షాపుకు వెళ్లాల్సిన పని లేదు, క్యూలలో నిలబడాల్సిన పని అంతకంటే ఉండదు.

ALSO READ: తమిళ రాజకీయంలో దళపతి ఎంట్రీ.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుండి బరిలోకి విజయ్..

కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే కార్డు రద్దువుతుంది. ట్రాక్టర్ మినహా నాలుగు చక్రాల వాహనం ఉంటే క్యాన్సిల్ అవుతుంది. మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే మీ పేరు ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంది. సభ్యులు మరణించినా, వివాహమై వెళ్లిపోయినా వారి పేర్లను తొలగించకపోతే కార్డులో ఇబ్బందులు రావచ్చు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×