E-Paper
Advertisement

Road Accident In Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..

Road Accident In Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..
Advertisement

9 Killed in Road Accident In Rajasthan: రాజస్థాన్‌లోని కరౌలీలో బొలెరో- ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. బొలెరోలో ఉన్న నలుగురికి గాయాలు కాగా, వారిని కరౌలి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కరౌలి-మండ్రాయల్ రహదారిపై  సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరౌలి-మండ్రాయల్ రహదారిలోని దుండపురా మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement

ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు స్థానికులు.

Advertisement

పోలీసులు క్షతగాత్రులందరినీ కరౌలి జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు తొమ్మిది మంది మరణించినట్లు ప్రకటించారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద వార్త తెలియగానే కలెక్టర్ నీలభ్ సక్సేనా, ఎస్పీ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ఏడీఎం రాజ్‌వీర్ చౌదరి ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు.

Tags

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×