E-Paper
Advertisement

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Bilaspur:  బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!
Advertisement

Bilaspur: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రైల్వే ట్రాక్‌పై ఏకంగా మూడు రైళ్లు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించి భయంతో కేకలు వేశారు. అయితే, పెను ప్రమాదాన్ని పసిగట్టిన మూడు రైళ్ల లోకోపైలట్‌లు తక్షణమే అప్రమత్తమయ్యారు. వారు అత్యంత చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి, సరైన సమయంలో రైళ్లను నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లోకోపైలట్ల అప్రమత్తత వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిలిచిపోయింది.

Read Also: Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

Advertisement

ఈ తాజా ఘటన రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఇదే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో, ఒక గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకోపైలట్‌తో సహా మొత్తం 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఆ విషాద ఘటన మరువకముందే, ఇప్పుడు బిలాస్‌పుర్‌లో మళ్లీ అదే తరహాలో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడం గమనార్హం. ఇది సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×