E-Paper
Advertisement

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Bilaspur:  బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Bilaspur: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రైల్వే ట్రాక్‌పై ఏకంగా మూడు రైళ్లు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించి భయంతో కేకలు వేశారు. అయితే, పెను ప్రమాదాన్ని పసిగట్టిన మూడు రైళ్ల లోకోపైలట్‌లు తక్షణమే అప్రమత్తమయ్యారు. వారు అత్యంత చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి, సరైన సమయంలో రైళ్లను నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లోకోపైలట్ల అప్రమత్తత వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిలిచిపోయింది.

Read Also: Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..

ఈ తాజా ఘటన రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఇదే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో, ఒక గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకోపైలట్‌తో సహా మొత్తం 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఆ విషాద ఘటన మరువకముందే, ఇప్పుడు బిలాస్‌పుర్‌లో మళ్లీ అదే తరహాలో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడం గమనార్హం. ఇది సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×