Bilaspur: ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్లో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రైల్వే ట్రాక్పై ఏకంగా మూడు రైళ్లు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించి భయంతో కేకలు వేశారు. అయితే, పెను ప్రమాదాన్ని పసిగట్టిన మూడు రైళ్ల లోకోపైలట్లు తక్షణమే అప్రమత్తమయ్యారు. వారు అత్యంత చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి, సరైన సమయంలో రైళ్లను నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లోకోపైలట్ల అప్రమత్తత వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిలిచిపోయింది.
Read Also: Express Train Incident: ట్రైన్ చక్రాలకు నిప్పు.. ఒక్కసారిగా అందరూ పొలాల్లోకి దూకి..
ఈ తాజా ఘటన రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో, ఒక గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకోపైలట్తో సహా మొత్తం 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఆ విషాద ఘటన మరువకముందే, ఇప్పుడు బిలాస్పుర్లో మళ్లీ అదే తరహాలో ఒకే ట్రాక్పై మూడు రైళ్లు రావడం గమనార్హం. ఇది సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే ట్రాక్పై మూడు రైళ్లు.. తప్పిన ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్లో ఒకే ట్రాక్పై మూడు రైళ్లు రావడం భయాందోళనకు గురిచేసింది. లోకోపైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. pic.twitter.com/9iICRWeREz
— ChotaNews App (@ChotaNewsApp) November 6, 2025