E-Paper
Advertisement

Sam Pitroda Reappointed: శ్యాం పిట్రోడాకు అదే పదవి.. నియమించిన కాంగ్రెస్ హైకమాండ్!

Sam Pitroda Reappointed: శ్యాం పిట్రోడాకు అదే పదవి.. నియమించిన కాంగ్రెస్ హైకమాండ్!
Advertisement

Sam Pitroda Re-appointed: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా శ్యాం పిట్రోడాను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే పోస్టుకు ఆయన ఛైర్మన్‌గా ఉండేవారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో శ్యాంపిట్రోడా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయననే కాంగ్రెస్ పార్టీ నియమించింది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో వారసత్వ పన్నుపై శ్యాం పిట్రోడా ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా వివాదాస్పదమైంది. దీన్ని ఆయుధంగా మార్చుకున్న ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారని విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా అదే రేంజ్‌లో కౌంటరిచ్చింది.

Advertisement

భారతదేశాన్ని విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి భారతదేశం ఓ నిదర్శనమని శ్యాం పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారని గుర్తుచేశారు.

Also Read:  లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. కొత్త పదవితో పెరిగిన బాధ్యతలు

Advertisement

మనది వైవిధ్యమైన దేశమని, తూర్పున ఉన్న ప్రజలు చైనాయుల్లా, పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని వెల్లడించారు శ్యాం పిట్రోడా. ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులు మాదిరిగా ఉంటే.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని శామ్ పిట్రోడా గుర్తుచేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది.

Tags

Related News

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Big Stories

Advertisement
×