E-Paper
Advertisement

Sitaram yechury: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

Sitaram yechury: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

Sitaram yechury: భారత కమ్యూనిస్టు పార్టీ నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంలో ఆయన సోమవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో జాయిన్ అయ్యారు. సీతారాం ఆరోగ్యం రీత్యా అత్యవసర విభాగంలో చేర్చినట్టు సీపీఎం వర్గాలు వెల్లడించాయి.

వైద్య పరీక్షల కోసం ఆయన ఇటీవల ఎయిమ్స్‌కి వెళ్లారు. నిమోనియా ఉందని తేలడంతో అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఏచూరి కంటి ఆపరేషన్ చేయించుకున్నారు.

2021లో ఏచూరి సీతారాం పెద్ద కొడుకు ఆశిష్ కరోనాతో మరణించిన విషయం తెల్సిందే. రెండువారాల పాటు కరోనాతో పోరాడిన ఆయన, ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆశిష్ మరణం సీతారాం మానసికంగా కుంగదీసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సీతారాం ఏచూరి గురించి తెలియనివారు ఉండరు. ఎనిమిదేళ్ల కిందట బెస్ట్ పార్లమెంటేరియన్‌గా అవార్డు సొంతం చేసుకున్నారు.

ALSO READ: ప్రభుత్వ ఆస్పత్రులలో 25 శాతం భద్రత పెంపు.. కేంద్రం కీలక ఆదేశాలు..

బ్రహ్మణ కుటుంబానికి చెందిన ఏచూరి సీతారాం.. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ)లో జాయిన్ అయ్యారు. 1975లో ఢిల్లీ జేఎన్‌యులో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యారు. 1977-78 మధ్యకాలంలో మూడుసార్లు జేఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెల్సిందే. మరుసటి ఏడాది సీపీఎంలో సభ్యుడిగా చేరారు ఏచూరి సీతారాం. లెఫ్ట్ పార్టీలకు జేఎన్‌యును బలమైన వేదికగా మార్చడంలో సీతారం ఏచూరి, బృందాకారత్ కీలక పాత్ర పోషించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×