BigTV English
Advertisement

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారిన కొత్త డీపీఆర్ ఆమోదం!

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారిన కొత్త డీపీఆర్ ఆమోదం!

Polavaram Project DPR Funds(AP latest news): పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర కీలకంగా మారింది. ఈ ఆమోదముద్ర పడితేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఆమోద ముద్ర లభించకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,615.47 కోట్ల నిధుల విడుదల ఆగిపోయింది. ఈ నిధుల కోసం కూటమి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులు సీతారామన్, పాటిల్‌లతో చర్చించారు.


అయితే, కూటమి ప్రభుత్వం తొలి, మలిదశ జోలికి వెళ్లకుండా కేవలం 45.72 మీటర్ల స్థాయికి నీళ్లు నిల్వ చేసేందుకు అవసరమైన భూసేకరణతోపాటు పునరావాస కేంద్రాలకు సంబంధించిన విభజన చట్టం ప్రకారం నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది.

ప్రస్తుతం తొలి దశ పేరుతో రూ.30,436.95కోట్లకు కొత్త డీపీఆర్ సిద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదాలు ఉన్నాయి. అయితే కేంద్ర మంత్రిమండలి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తోంది. పోలవరం పనులు ముందుకు తీసుకెళ్లాలంటే ఈ నిధులు అవసరం కానున్నాయి. ఈ ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానున్నాయి.


గతంలో 2010-11 ధరలతో రూ.16,010.45 కోట్లకు డీపీఆర్ ఆమోదం పొందింది. దీని ప్రకారం నిధులను కేంద్రం తిరిగి చెల్లించింది. అయితే తొలిదశ పేరుతో సిద్ధంగా ఉన్న డీపీఆర్ కేంద్ర ఆమోదం పొందితే రాష్ట్రానికి రూ.12,157.53 కోట్లు అందనున్నాయి.

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×