Sopore Encounter: ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని నౌపోరా సోపోర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో అక్కడ ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లను మూసివేశారు. అదేవిధంగా మొబైల్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శక్తివంతమైన లైట్లను ఏర్పాటు చేయడంతో ఉగ్రవాదులు పారిపోకుండా నిరోధించేందుకు దోహదపడ్డాయి. ఎన్ కౌంటర్ కు సంబంధించి సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ.. నౌపోరా సోపోర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, వారి గుర్తింపు ఇంకా వెల్లడికాలేదని ఆయన తెలిపారు.
Also Read:భార్య స్త్రీధనం భర్త వాడుకుంటే.. దానిని తిరిగి ఇచ్చేయాలి : సుప్రీంకోర్టు
అయితే, ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు.. ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారు.