BigTV English

Supreme Court: జూన్ 15 లోపు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.. ఆప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు..

Supreme Court: జూన్ 15 లోపు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.. ఆప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు..

Supreme Court Judgement on AAP Party OfficeSupreme Court Judgement on AAP Party Office: జిల్లా న్యాయవ్యవస్థను విస్తరించేందుకు ఢిల్లీ హైకోర్టుకు భూమిని కేటాయించామని, జూన్ 15 లోపు ఆమ్ ఆద్మీ పార్టీ రూస్ అవెన్యూలోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2017 తర్వాత పార్టీకి అక్కడ ఉండే హక్కు లేదని కోర్టు పేర్కొంది.


భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌ను ఆప్ సంప్రదించాలని కోరింది.

రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రాంగణాన్ని ఖాళీ చేయడానికి జూన్ 15, 2024 వరకు సమయం ఇస్తున్నామని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా జిల్లా న్యాయవ్యవస్థను విస్తరించేందుకు కేటాయించిన భూమిని సత్వర ప్రాతిపదికన వినియోగించుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.


Read More: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..

 

ఢిల్లీ హైకోర్టు భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా ఉంది అని ధర్మాసనం ప్రశ్నించింది. అక్కడ ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తామని పేర్కొంది. ప్రజలకు ఉపయోగపడే భూమిని తిరిగి ఢిల్లీ హైకోర్టుకు అప్పగించాలని తెలిపింది.

 

Related News

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Ayodhya: అయోధ్యలో మరో కీలక ఘట్టం.. బృహస్పతి కుండ్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Big Stories

×