BigTV English

Supreme Court: జూన్ 15 లోపు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.. ఆప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు..

Supreme Court: జూన్ 15 లోపు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.. ఆప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు..

Supreme Court Judgement on AAP Party OfficeSupreme Court Judgement on AAP Party Office: జిల్లా న్యాయవ్యవస్థను విస్తరించేందుకు ఢిల్లీ హైకోర్టుకు భూమిని కేటాయించామని, జూన్ 15 లోపు ఆమ్ ఆద్మీ పార్టీ రూస్ అవెన్యూలోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2017 తర్వాత పార్టీకి అక్కడ ఉండే హక్కు లేదని కోర్టు పేర్కొంది.


భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌ను ఆప్ సంప్రదించాలని కోరింది.

రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రాంగణాన్ని ఖాళీ చేయడానికి జూన్ 15, 2024 వరకు సమయం ఇస్తున్నామని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా జిల్లా న్యాయవ్యవస్థను విస్తరించేందుకు కేటాయించిన భూమిని సత్వర ప్రాతిపదికన వినియోగించుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.


Read More: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..

 

ఢిల్లీ హైకోర్టు భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా ఉంది అని ధర్మాసనం ప్రశ్నించింది. అక్కడ ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తామని పేర్కొంది. ప్రజలకు ఉపయోగపడే భూమిని తిరిగి ఢిల్లీ హైకోర్టుకు అప్పగించాలని తెలిపింది.

 

Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×