E-Paper
Advertisement

త్రిషపై కామెంట్స్ వ్యవహారం.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్, బెయల్ కోసం హైకోర్టుకు

త్రిషపై కామెంట్స్ వ్యవహారం.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్, బెయల్ కోసం హైకోర్టుకు
Advertisement

Chennai: హీరోయిన్ త్రిషపై హాట్ కామెంట్స్ చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత అరెస్టు చేయడం చకచకా జరిగింది. వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరిస్థితి గమనించిన ఉదయనిధి, బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది?

త్రిషపై హాట్ కామెంట్స్.. చిక్కుల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌

కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల అంశం వేడెక్కింది. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సోమవారం తంజావూరులో జరిగిన నిరసనలలో హీరోయిన్ త్రిషను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Advertisement

ఆయన ప్రసంగం సమయంలో కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేయడంతో పరోక్షంగా నటి గురించి ప్రస్తావించారు. ఆమె గురించి ద్వంద్వార్థం ధ్వనించేలా అనుచితంగా మాట్లాడారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించేనని వివరణ ఇచ్చారు.ఉదయనిధి వ్యాఖ్యలపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఇవి ముమ్మాటికీ అసహ్యమైన వ్యాఖ్యలని, ఎవరిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని టీవీకే నేతలు అన్నారు.

 

బెయల్ కోసం హైకోర్టుకు

Advertisement

డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని మండిపడ్డారు. చివరకు బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యవహారం కాస్త ముదిరిపాకాన పడింది. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తంజావూరు టీవీకే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ వింగ్ ఆర్గనైజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలతో తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయనిధి ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు చేపట్టారు.

 

ఇంటి చుట్టూ పోలీసులు మోహరింపు

ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. తంజావూరు నుంచి వచ్చిన పోలీసుల బృంద, చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి గమనించిన ఉదయనిధి, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. న్యాయస్థానం తీర్పు ఏ విధంగా వస్తుందోనని కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. వాహనాల్లో వీ2వీ వ్యవస్థ, ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Related News

E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరసన.. ప్రధాని నివాసానికి పాదయాత్ర!

వాహనదారులకు బిగ్ అలర్ట్.. వాహనాల్లోకి వీ2వీ వ్యవస్థ, ఎన్ని ఉపయోగాలో తెలుసా?

పీకే గెలుపుతో బీహార్ రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీలో నిశ్శబ్దం-ఆపై లుకలుకలు, నితీష్‌కుమార్ రీఎంట్రీ?

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

Big Stories

Advertisement
×