E-Paper
Advertisement

Turkey, syria : టర్కీ, సిరియాలో దారుణ పరిస్థితులు.. 21 వేలు దాటిన మృతుల సంఖ్య..

Turkey, syria : టర్కీ, సిరియాలో దారుణ పరిస్థితులు.. 21 వేలు దాటిన మృతుల సంఖ్య..
Advertisement

Turkey, syria : వరుస భూకంపాలు టర్కీ, సిరియా దేశాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి ప్రకోపానికి వందల భవనాలు నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అందులో ఇప్పటికే చాలా మంది ప్రాణాల కోసం పోరాడి ఓడిపోయారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టర్కీ, సిరియాలో ఇప్పటికే 21 వేలమందిపైగా మృత్యువాత పడ్డారు. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది.

బాధితులపై చలి పంజా..
సోమవారం రాత్రి భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,117 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. ఇంకోవైపు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో బాధితులను చలి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ ఉష్టోగ్రతలు అమాంతంగా పడిపోయాయి. భూకంప బాధితులు వెచ్చదనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇందుకోసం పార్కుల్లోని బెంచీలను తగులబెట్టేస్తున్నారు. మరోవైపు బాధితులు ఆహారం , తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు తాత్కాలిక శిబిరాలు, స్టేడియాల్లో తలదాసుకుంటున్నారు.

Advertisement

కొనసాగుతున్న సహాయక చర్యలు..
టర్కీ, సిరియాలో సహాయ చర్యలు వేగంగా జరగడంలేదు. శిథిలాల తొలగింపు ప్రహసనంగా మారింది. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సహాయక చర్యలు నత్తనడక సాగుతున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ హతాయ్ ప్రావిన్సులో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. టర్కీలో మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. భూకంపం తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. సాయం సరిగా అందటంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందని అంటున్నారు. సహాయక చర్యల్లో లక్షా 10 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లులతో శిథిలాలను తొలగిస్తున్నారు.

భారత్ బలగాల సేవలు..
టర్కీలోని హతాయ్ ప్రావిన్సులో భారత్ సైన్యం తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఇక్కడ బాధితులకు వైద్యసేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. గాజియాంతెప్‌ ప్రాంతంలో ఆరేళ్ల పాపను ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు రక్షించాయి. కాంక్రీటు శిథిలాలను పగులగొట్టే యంత్రాలను వినియోగించడంతోపాటు శిథిలాల మధ్య ఇరుక్కుని ఉన్నవారి హృదయ స్పందనను గుర్తించగలిగే రాడార్లను సైనిక బలగాలు వాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారి రక్షించగలిగారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×