BigTV English
Advertisement

Turkey, syria : టర్కీ, సిరియాలో దారుణ పరిస్థితులు.. 21 వేలు దాటిన మృతుల సంఖ్య..

Turkey, syria : టర్కీ, సిరియాలో దారుణ పరిస్థితులు.. 21 వేలు దాటిన మృతుల సంఖ్య..

Turkey, syria : వరుస భూకంపాలు టర్కీ, సిరియా దేశాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి ప్రకోపానికి వందల భవనాలు నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అందులో ఇప్పటికే చాలా మంది ప్రాణాల కోసం పోరాడి ఓడిపోయారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టర్కీ, సిరియాలో ఇప్పటికే 21 వేలమందిపైగా మృత్యువాత పడ్డారు. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది.


బాధితులపై చలి పంజా..
సోమవారం రాత్రి భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,117 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. ఇంకోవైపు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో బాధితులను చలి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ ఉష్టోగ్రతలు అమాంతంగా పడిపోయాయి. భూకంప బాధితులు వెచ్చదనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇందుకోసం పార్కుల్లోని బెంచీలను తగులబెట్టేస్తున్నారు. మరోవైపు బాధితులు ఆహారం , తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు తాత్కాలిక శిబిరాలు, స్టేడియాల్లో తలదాసుకుంటున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు..
టర్కీ, సిరియాలో సహాయ చర్యలు వేగంగా జరగడంలేదు. శిథిలాల తొలగింపు ప్రహసనంగా మారింది. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సహాయక చర్యలు నత్తనడక సాగుతున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ హతాయ్ ప్రావిన్సులో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. టర్కీలో మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. భూకంపం తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. సాయం సరిగా అందటంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందని అంటున్నారు. సహాయక చర్యల్లో లక్షా 10 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లులతో శిథిలాలను తొలగిస్తున్నారు.


భారత్ బలగాల సేవలు..
టర్కీలోని హతాయ్ ప్రావిన్సులో భారత్ సైన్యం తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఇక్కడ బాధితులకు వైద్యసేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. గాజియాంతెప్‌ ప్రాంతంలో ఆరేళ్ల పాపను ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు రక్షించాయి. కాంక్రీటు శిథిలాలను పగులగొట్టే యంత్రాలను వినియోగించడంతోపాటు శిథిలాల మధ్య ఇరుక్కుని ఉన్నవారి హృదయ స్పందనను గుర్తించగలిగే రాడార్లను సైనిక బలగాలు వాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారి రక్షించగలిగారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×