E-Paper
Advertisement

Mumbai: ముంబైలో పెను ప్రమాదం.. ఢీ కొన్న రెండు విమానాలు.. చివరకు!

Mumbai: ముంబైలో పెను ప్రమాదం.. ఢీ కొన్న రెండు విమానాలు.. చివరకు!
Advertisement

Mumbai: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే సమయంలో రెండు విమానాలు ఒకదానికొకటి తగులుకున్న ఘటన కలకలం రేపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన విమానాల రెక్కల భాగాలు (Wings) ఒకదానికొకటి రాసుకున్నాయి. అయితే, ఈ సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన ఎలా జరిగిందంటే?
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం (6E791) ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత టాక్సీ వే మీదుగా వెళ్తోంది. అదే సమయంలో ముంబై నుంచి కోయంబత్తూర్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం (AI2732) రన్‌వే సమీపంలో ఆగి ఉంది. ఈ క్రమంలో ఇండిగో విమానం పక్క నుంచి వెళ్తుండగా, రెండు విమానాల రెక్కల కొనలు (Winglets) ఒకదానికొకటి బలంగా తగిలాయి.

Advertisement

ఈ ప్రమాదం జరిగిన వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. రెండు విమానాల రెక్కల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమగ్ర విచారణకు ఆదేశించింది. గ్రౌండ్ కంట్రోల్ వైఫల్యమా లేక పైలట్ల తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కోల్‌కతాలో భూకంపం బీభత్సం.. పేకమేడల్లా ఊగిపోయిన భవనాలు, భయాందోళనలో ప్రజలు

Advertisement

అయితే ఈ అనూహ్య ఘటనతో కోయంబత్తూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సదరు విమానయాన సంస్థలు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి, వారిని వేరే విమానాల్లో పంపేందుకు ఏర్పాట్లు చేశాయి. రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు భద్రతా ఏర్పాట్లపై చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×