E-Paper
Advertisement

Todays Chanakya Exit Polls: చాణక్య సర్వే షాకింగ్ రిపోర్ట్.. ఎవరికి ఎన్ని సీట్లంటే.. వారికి షాక్ త‌ప్ప‌దా?

Todays Chanakya Exit Polls: చాణక్య సర్వే షాకింగ్ రిపోర్ట్..  ఎవరికి ఎన్ని సీట్లంటే.. వారికి షాక్ త‌ప్ప‌దా?
Advertisement

Todays Chanakya Exit Polls: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రముఖ సర్వే సంస్థ ‘టుడేస్ చాణక్య’ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దీదీకి షాకిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) అఖండ విజయం సాధించబోతోందని ఈ సంస్థ జోస్యం చెప్పింది. బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 181 నుంచి 203 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) 89-111 స్థానాలకే పరిమితం కావచ్చని పేర్కొంది. ఓట్ల శాతం పరంగా బీజేపీకి 48 శాతం.. టీఎంసీకి 38 శాతం ఓట్లు రావొచ్చని వివరించింది. బెంగాల్‌లో మెజారిటీ మార్కు 148 కాగా.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటుతుందని నివేదిక వెల్లడించింది.

దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమికి 69 సీట్లు వస్తాయని.. అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమి 64 స్థానాలకే పరిమితం అవుతుందని టుడేస్ చాణక్య అంచనా వేసింది. బీజేపీ ఇక్కడ 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఓట్ల శాతంలో యూడీఎఫ్‌కు 40 శాతం.. ఎల్డీఎఫ్‌కు 38 శాతం వచ్చినట్లు తెలిపింది. నిన్న వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా కేరళలో యూడీఎఫ్ కే మొగ్గు చూపిన నేపథ్యంలో చాణక్య నివేదిక ఆ అంచనాలను బలపరుస్తోంది.

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోబోతోందని చాణక్య స్పష్టం చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 114 నుంచి 136 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ 52-74 సీట్లు సాధించి రాష్ట్రంలో రెండో అతిపెద్ద శక్తిగా అవతరించే అవకాశం ఉందని సంచలన అంచనా వేసింది. ఏఐడీఎంకే (AIADMK) కేవలం 34-56 స్థానాలకే పరిమితం కావచ్చని పేర్కొంది. నిన్నటి యాక్సిస్ మై ఇండియా సర్వే విజయ్ పార్టీ విజయం ఖాయమని చెప్పగా.. చాణక్య మాత్రం డీఎంకేకే జై కొట్టింది.

అస్సాం రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి ప్రభంజనం సృష్టించబోతోందని చాణక్య నివేదిక పేర్కొంది. మొత్తం 126 సీట్లలో బీజేపీ కూటమి ఏకంగా 93 నుంచి 111 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ కూటమి 14-32 సీట్లకే పరిమితం కావచ్చని తెలిపింది. ఎన్డీయేకు ఏకంగా 50 శాతం ఓట్లు వస్తాయని వివరించింది. యాక్సిస్ మై ఇండియా.. చాణక్య స్ట్రాటజీస్ వంటి ఇతర సంస్థలు కూడా అస్సాంలో ఎన్డీయేదే విజయమని అంచనా వేశాయి.

Advertisement

Read Also: బెంగాల్ లో విజయంపై దీదీ ధీమా.. ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించని యాక్సిస్ మై ఇండియా

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×