E-Paper
Advertisement

Bus Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. మంటల్లో నాలుగు బస్సులు-కార్లు, మృతుల సంఖ్య భారీగా

Bus Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. మంటల్లో నాలుగు బస్సులు-కార్లు, మృతుల సంఖ్య భారీగా
Advertisement

Bus Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌  హైవేపై ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ.. తెల్లవారుజామున నాలుగు బస్సులకు మంటలకు అంటుకున్నాయి.  ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం

Advertisement

మంగళవారం ఉదయం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఏం జరిగిందో తెలీదు. నాలుగు ట్రావెల్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి.సమీపంలోని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బస్సుల మంటలకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

కనీసం నాలుగు బస్సులు మంటల్లో కాలిపోయాయని ఆ వ్యక్తి చెప్పినట్టు ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

Advertisement

మంటల్లో ట్రావెల్ బస్సులు, మృతుల సంఖ్యపై

ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజన్లు అదుపు చేసే ప్రయత్నం చేశాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అసలు అక్కడ ఏం జరిగిందో కనిపించడం కష్టంగా మారింది.మంటలు త్వరగా వ్యాపించడంతో ప్రజలు ఆ ప్రాంతం నుంచి భయంతో పరిగెడుతూ కనిపించారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది. దట్టమైన పొగమంచు కారణంగా అనేక బస్సులు ఒకదానికి మరొకటి ఢీ కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కనీసం నలుగురు మరణించగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడు బస్సులు-మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

దాదాపు 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. బల్దేవ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మైల్‌స్టోన్ 127 సమీపంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ALSO READ: ప్రమాదకరస్థాయిలో పొగమంచు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలు

 

 

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×